షాద్నగర్టౌన్ : సీఎం సహాయనిధి పేదలకు వరంలా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. మున్సిపాలిటీలోని నెహ్రూనగర్ కాలనీకి చెందిన విష్ణుమూర్తికి రూ. 25,000, కొత్తూరు మండలంలోని వైఎం తండాకు చెందిన గణేష్కు రూ. 60,000, రెడ్యా రూ. 46,500, మల్లాపూర్ గ్రామానికి చెందిన జార్జిరెడ్డి రూ. 60,000, సిద్ధాపూర్ గ్రామానికి చెందిన జంగయ్యకు రూ. 15వేల, రెడ్డిపాలెం గ్రామానికి చెందిన వంశీ రూ. 60వేలు, తీగపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులుకు రూ. 60వేలు, రమేశ్కు రూ. 54వేలు, కోడిచెర్ల తండాకు చెందిన రూ. 20వేలు, ఇన్ముల్నర్వకు చెందిన కృష్ణకు రూ. 16వేల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు.
ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సర్కార్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, కౌన్సిలర్లు సర్వర్పాషా, శ్రీనివాస్, కొత్తూరు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణ, మల్లాపూర్, సర్పంచులు సాయిలు, అరుణరమేశ్, నాయకులు జూపల్లి శంకర్, సత్యనారాయణ, రమేశ్, దర్శన్ పాల్గొన్నారు.