హయత్నగర్ రూరల్ : సీఎం సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన సూర్యకళ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు దవాఖానలో చేరింది. చికిత్సకు అధిక మొత్తంలో ఖర్చు కావడంతో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకుంది.
ఆదివారం బాధిత కుటుంబ సభ్యుడు శ్రీశైలంకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మంజూరైన చెక్కును అందజేశారు. ఆపదలో ఆదుకున్న ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కిషన్రెడ్డి, సర్పంచ్ స్వరూపకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.