కొందుర్గు : గ్రామాల్లోని నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంలాంటిదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం కొందుర్గు మండలానికి చెందిన ఎనిమిది మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. రాజ రమేశ్రెడ్డికి రూ.2.25 లక్షలు, జార్జ్రెడ్డికి లక్షా 25వేలు, శాన్ ఆలీకి రూ. 60వేలు, వెంకటయ్య కు రూ. 36వేలు, వీరేష్కు రూ. 22వేలు, వేనమ్మకు రూ. 38 వేలు, బాల్రాజ్కు రూ. 36వేలు, పండరీకి రూ. 31వేల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం పని చేస్తుందన్నారు. ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చిన పూర్తి సహాయం అందిస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగయ్య, వైస్ ఎంపీపీ రాజేష్పటేల్, పీఎసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎదిర రామకృష్ణ పాల్గొన్నారు.