షాద్నగర్టౌన్ ఆగస్టు 03 : నిరుపేదలకు సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ పట్టణంలోని శ్రీనివాసకాలనీ చెందిన మహ్మద్ తయ్యుబ్కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. లక్షా50వేలను బుధవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సీఎం సహాయనిధితో నిరుపేదలకు కార్పొరేట్స్థాయిలో వైద్యం అందుతుందన్నారు. పేద ప్రజల ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజా సంక్షేమం కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, నాయకులు పాల్గొన్నారు.