కేశంపేట : ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేటలోని ఎమ్మెల్యే స్వగృహంలో శనివారం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన శివలింగం అనే వ్యక్తికి రూ. 2లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు ఎల్లప్పుడు సహాయ సహాకారాలు అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
శివలింగం గత కొంత కాలంగా ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ఆర్థిక సహాయం కోసం ఎమ్మెల్యే ఆశ్రయించగా సీఎం రిలీఫ్ఫండ్ నుంచి రూ. 2లక్షలు మంజూరు చేయించారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్యాదవ్, టీఆర్ఎస్ అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, నాయకులు కుర్వగూడ నర్సింహా, లక్ష్మీనారాయణ, రాంచందర్నాయక్, శివ, రాఘవేందర్, రవీందర్ పాల్గొన్నారు.