షాద్నగర్టౌన్, జూలై 18: పేదల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం షాద్నగర్ మున్సిపాలిటీ నెహ్రూనగర్కాలనీ చెందిన వరుణ్తేజకు రూ. 55వేలు, నాగరాజుకు రూ. 60వేలు, కసాబ్వాడకు చెందిన అనూషకు రూ. 14వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల అభ్యన్నతే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ప్రజా ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు.
సీఎం సహాయనిధి పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భీష్వ కిష్టయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్ సర్వర్పాషా పాల్గొన్నారు.