ఆకాశమే హద్దుగా.. అభివృద్ధిలో నగరం దూసుకుపోతున్నది. కోటికిపైగా జనాభా ఉన్న మహానగరంలో ‘వ్యూహాత్మక’ ప్రణాళికతో ప్రజా రవాణా వ్యవస్థ పురోగమిస్తున్నది. సరికొత్త భాగ్యనగరం ఆవిష్కృతమవుతున్నది. నలుదిశలా నగరం విస్తరిస్తుండటంతో ఇందుకు తగ్గట్టుగానే మెరుగైన రవాణా సదుపాయాలు కల్పిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.ట్రాఫిక్ చిక్కులు తప్పించేలా.. బహుముఖ వ్యూహం అమలు చేస్తున్నది. ఆరేండ్లలోనే 33 ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులు వస్తే.. అందులో 17 ఫ్లైఓవర్లు ఉండటం విశేషం. సీఆర్ఎంపీ, లింకు రోడ్లు సైతం ప్రజా రవాణాను మరింత బలోపేతం చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఎస్ఆర్డీపీ రెండో దశను రూ.3500కోట్లతో చేపట్టనున్నారు. ఇక ఎన్నో ప్రత్యేకతలు కలబోసుకున్న మెట్రో రైలు నగర రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. వేగవంతంగా, సౌకర్యవంతంగా సేవలందిస్తూ.. రోజుకు లక్షలాది మందిని గమ్యస్థానానికి చేర్చుతున్నది. 2600 పిల్లర్లు.. 69 కి.మీ మేర నిర్మించిన మన మెట్రో ఎంతో ప్రత్యేకమైనది. దేశంలో ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద మార్గంగా రికార్డులకెక్కింది. ఇదిలా ఉంటే నగరంలో మరిన్ని మార్గాల్లో మెట్రో విస్తరణకు చర్యలు తీసుకుంటున్నది రాష్ట్ర సర్కారు. ఇందులోభాగంగానే ఎయిర్పోర్టు మెట్రో(రాయదుర్గం- శంషాబాద్ విమానాశ్రయం)కు నేడు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
పెరుగుతున్న పట్టణీకరణతో ప్రజారవాణా వ్యవస్థలో మెట్రోకు ప్రాధాన్యత పెరిగింది. కార్లు, బస్సులు, ద్విచక్రవాహనాలతో వెలువడే కాలుష్యం పట్టణాల్లో అనేక సమస్యలకు దారితీస్తోంది. దానికి పరిష్కారమార్గంగా దేశ వ్యాప్తంగా ఉన్న 8మెట్రో నగరాలతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో మెట్రో ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మొత్తంగా 18 నగరాల్లో 22 మెట్రో ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉండగా, 12 నగరాల్లో పూర్తి స్థాయిలో మెట్రో రైళ్ల సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అందులో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రత్యేకమైనది. ఢిల్లీ మెట్రో 351 కి.మీ మేర రైళ్లు పరుగులు పెడుతుంటే, 3 కారిడార్లలో హైదరాబాద్ మెట్రో 69.2 కి.మీ మేర అందుబాటులో ఉండి దేశంలోనే రెండో అతి పెద్ద మెట్రో మార్గంగా రికార్డుల కెక్కింది.
– సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ)
సుఖవంతమైన ప్రయాణం
2041సంవత్సరానికిగానూ అంచనా(ఉమ్టా నివేదిక ఆధారంగా)
కీలక ఘట్టాలు
రెండో విడుత మెట్రో ఇలా..
రెండో దశ మెట్రో కింద రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 32 కి.మీ కొత్తగా మెట్రోపనులకు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.అదేవిధంగా బీహెచ్ఈఎల్ నుంచి కొండాపూర్, గచ్చిబౌలిమీదుగా టోలిచౌకీ,మెహిదీపట్నం, లక్డీకాపూల్ వరకు 26 కి.మీ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మరో 5 కి.మీ దూరం కలిపి మొత్తం మరో 62 కి.మీ మేర విస్తరించేందుకు డీపీఆర్లను కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇవే మార్గాలు కాకుండా భవిష్యత్తులో 2041 నాటికి మొత్తం 204 కి.మీ మేర మెట్రో మార్గాలను నిర్మించేలా ప్రతిపాదనలను హైదరాబాద్ యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు అథారిటీ(ఉమ్టా) రూపొందించింది.
ఎయిర్ పోర్టు మెట్రోలో విశేషాలు …
ఇవీ ప్రత్యేకతలు :