బడంగ్పేట, జూలై18 : సీఎం కేసీఆర్ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్ కు చెందిన ముగ్గురు విద్యార్థులు కరాటేలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, కాంస్య పథకాలు సాధించారు.
రెండో సౌత్ ఇండియా కరాటే కరాటే శాపియన్ షిప్ పోటీలను ఆంధ్ర ప్రదేశ్లోని విశాఖపట్నంలో జూలై 14,16న ఇండియన్ చోటా ఖాన్ పోటీలు నిర్వాహించారు. ఈ పోటీలలో మల్లాపూర్ విద్యార్థులు ప్రతిభ కనబర్చడంతో విద్యార్థులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ వేణు గోపాల్, మాస్టర్ వి నరేందర్, కోచ్ శరత్ కుమార్ తదితరులు ఉన్నారు.