షాద్నగర్, డిసెంబర్4 : మహబూబ్నగర్ పర్యటనకు వెళ్తున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్కు షాద్నగర్ బైపాస్ రోడ్డులో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, మహిళా ప్రజాప్రతినిధులు మంగళహారతులతో స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు.
రోడ్డు వెంట భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై అంజయ్యయాదవ్ అనే నినాదాలతో హోరిత్తించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల తీరు తెలిపేలా డీజే పాటల హోరు కొనసాగింది. వేలాదిగా గులాబీ సైన్యం తరలిరావడంతో ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.