రంగారెడ్డి, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): “పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో లక్ష ఎకరాలకు నీళ్లు పారించి తీరుతాం.. నిండుకుండలా ఉన్న ఇబ్రహీంపట్నం చెరువును చూస్తే ఎంతో సంబురమనిపిస్తున్నది.. మునుగోడు దగ్గర నిర్మిస్తున్న రిజర్వాయర్ ద్వారా వంద చెరువులను నింపుకొని ఈ ప్రాంతానికి కృష్ణా నీళ్లు అందిస్తాం.. ” అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నం శివారులోని ఖానాపూర్ గేటు వద్ద మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరై ప్రసంగించారు. రంగారెడ్డి, మహబూబ్నగర్, వికారాబాద్ జిల్లాలకు కృష్ణా నీరు రావాల్సిన అవసరం ఉందని, విశ్వప్రయత్నం చేసి ఈ ప్రాజెక్టును తెస్తే కాంగ్రెసోళ్లు 196 కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. దేవుని దయ వల్ల అన్ని క్లియరెన్స్లు రావడంతో ఎత్తిపోతలను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించినట్లు తెలిపారు. రీజినల్ రింగ్రోడ్డుతో ఇబ్రహీంపట్నం స్వరూపమే మారిపోనున్నదన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కలెక్టరేట్ను ఏర్పాటు చేసుకున్నామని, త్వరలో పండ్లమార్కెట్, లక్షమందికి ఉద్యోగాలు కల్పించే ఫాక్స్కాన్ కంపెనీ కొలువుదీరనున్నాయన్నారు. మరింత అభివృద్ధి జరుగాలంటే మరోసారి కిషన్రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెసొళ్లు రైతుబంధును దుబారా ఖర్చు , ధరణిని ఎత్తివేస్తామంటున్నారన్నారు. ధరణి, రైతుబంధు ఉండాలో, పోవాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో ఈ ప్రాం తంలో కృష్ణా నీటిని పారించి లక్ష ఎకరాలకు అందిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి మద్దతుగా ఇబ్రహీంప ట్నం శివారులోని ఖానాపూర్ గేటు వద్ద మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు. కృషానది పరీవాహక ప్రాంతాలైన రంగారెడ్డి, మహబూబ్నగర్, వికారాబాద్ జిల్లాలకు కృష్ణా నీళ్లు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విశ్వప్రయత్నం చేసి ప్రాజెక్టును తెస్తే కాంగ్రెసోళ్లు 196 కేసులు వేసి అడ్డుకున్నారని విమర్శించారు. దేవుడి దయవల్ల అన్ని క్లియరెన్స్లు రావడంతో ఎత్తిపోతలను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించినట్లు తెలిపా రు. మునుగోడు దగ్గర నిర్మిస్తున్న రిజర్వాయర్తో వంద చెరువులను నింపుకొని లక్ష ఎకరాలకు కృష్ణా నీటిని పారిస్తామని సీఎం హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల నిమిత్తం రూ.2,931 కోట్లను కేటాయించటంతోపాటు ఇప్పటికే పలు జాతీ య, అంతర్జాతీయ సంస్థ లు, కంపెనీలను తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు.
ఇబ్రహీంపట్నం చెరువును చూస్తే సంబురంగా ఉన్నది..
నీళ్లు లేక ఇబ్రహీంపట్నం ప్రాంత రైతాంగం పడ్డ కష్టాలు తనకు తెలుసునని సీఎం కేసీఆర్ అన్నా రు. కరెంటు బోర్లపైనే ఆధారపడి రైతులు వ్యవసాయం చేశారన్నారు. ఇబ్రహీంపట్నం చెరువు ఎండిపోయి ఎడారిగా ఉంటే మంచిరెడ్డి కిషన్రెడ్డి పట్టుబట్టి హైదరాబాద్ మెట్రో వాటర్తో చెరువును నింపించారని గుర్తు చేశారు. ఇసుక ఫిల్టర్లతో కాంగ్రెస్ రాజ్యంలో చెరువు పరిస్థితి గం దరగోళంగా ఉండేదన్నారు. 35కి.మీల కాలువ ను బాగు చేసుకున్నామని, దేవుడి దయ వల్ల వర్షాలు బాగా కురుస్తుండడంతో నిండుకుండ లా చెరువు బ్రహ్మాండంగా కనిపిస్తున్నదన్నారు. హెలికాప్టర్ దిగుతుంటే చెరువు నీటితో కళకళలాడుతుండడంతో సంబురంగా ఉందన్నారు.
అభివృద్ధి జరుగాలంటే కిషన్రెడ్డిని గెలిపించాలి..
ఇబ్రహీంపట్నం మరింత అభివృద్ధి చెందాలంటే మంచిరెడ్డి కిషన్రెడ్డిని గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ ప్రాంతానికి తాను ఎప్పుడొచ్చినా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడగడం.. తాగు, సాగునీరు కావాలని కోరటం తప్ప ఆయన సొంత పనులను చేయాలని ఎప్పుడూ కోరలేదన్నారు. అనుభవం ఉన్న ..పనిచేసే మంచి నాయకుడు కిషన్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు, బీఆర్ఎస్ శ్రే ణులకు సూచించారు. రంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీని కిషన్రెడ్డి పట్టుబట్టి సాధించారని, రూ.700 కోట్లతో రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉన్నారని, దళితబంధు ఎక్కువ మందికి ఇవ్వాలని ఎమ్మెల్యే కోరుతున్నారని, స్పెషల్ కేస్గా తీసుకుని తప్పకుండా ఎక్కువమందికి దళితబంధు ఇస్తామని సీఎం స్పష్టంచేశారు. ఇంకా చాలా కావాలని కిషన్రెడ్డి కోరారని, మంచి ఎమ్మెల్యే ఉన్న సెగ్మెంట్కు ఇంకా కావాలని కోరుకోవడం సహజమేనన్నా రు. రీజినల్ రింగురోడ్డుతో ఇబ్రహీంపట్నం ముఖచిత్రమే మారనున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. కలెక్టరేట్, కొహెడ పండ్ల మార్కెట్తోపాటు లక్షల మందికి ఉద్యోగాలిచ్చే ఫాక్స్కాన్ కంపెనీ కూడా నియోజకవర్గంలోనే ఉందన్నారు. ఇబ్రహీంపట్నంలో వం ద పడకల దవాఖానను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. తన గ్రామంలో కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకు 60 ఎకరాలను సిద్ధం చేసి ఉంచినట్లు ఎమ్మె ల్యే కిషన్రెడ్డి చెబుతున్నారని, ఇవన్నీ జరుగాలంటే ఆయన్ను గెలిపించాలన్నారు. మున్ముందు నియోజకవర్గానికి మంచి భవిష్యత్తు ఉంటుందని .. ఈ చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే గందరగోళమే..
ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల చరి త్ర తెలుసుకోవాలని, అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ ఏం చేసిందో గమనించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే గందరగోళమేనని ఎద్దేవా చేశారు. రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి వంటి నేతలు అనాలోచితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఒకరు మూడు గం టల కరెంటు చాలంటే..మరొకరు 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని అంటున్నారని.. ఇంకొకాయన రైతుబంధు దుబారా అంటున్నాడని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారని, అదే చేస్తే ఇబ్రహీంపట్నంలోని స్థలాల్లో గందరగోళం జరుగుతుందన్నారు. మళ్లీ దళారులు వ స్తారని, పైరవీలు మొదలుపెడతారని అన్నారు. ధరణిని తీసుకొచ్చినోళ్లు ఉండాలా? ధరణిని బంగాళాఖాతంలో వేస్తమన్నోళ్లు ఉండాలో? నిర్ణయం మీ చేతుల్లోనే ఉన్నదన్నారు. ఓ రైతు గా రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ను, రైతుబంధు, రైతుబీమా ఇవ్వడంతోపాటు పండిన పంటను కూ డా ప్రభుత్వమే కొనేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రాజెక్టుల ద్వారాపారే నీళ్లకు నీటి తీరువా బకాయిలను బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేయడమే కాకుండా పన్నులేకుండా చేసిందన్నారు. మానవీయ కోణంలో కేసీఆర్ కిట్, అమ్మఒడి, కంటి వెలుగు వంటి పలు కా ర్యక్రమాలను సక్సెస్ఫుల్ చేపట్టామని గుర్తు చేశారు.
సాగర్ రహదారి విస్తరణకు సీఎం హామీ..
దరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో బీఎన్రెడ్డి నగర్ నుంచి మాల్ వరకు సాగర్ రహదారిని నాలుగులేన్లుగా విస్తరించేందుకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి సీఎం కేసీఆర్ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ దారి ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. తాళ్లపల్లిగూడ, మొండిగౌరెల్లి, ఎలిమినేడుతోపాటు పలు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ఆయన సీఎం కేసీఆర్ను కోరగా చర్యలు తీసుకుంటామన్నారు. కొహెడ వద్ద 170 ఎకరాల్లో ఏర్పాటుచేస్తున్న పండ్ల మార్కెట్కు తగిన నిధులు కేటాయించి వెంటనే ప్రారంభించాలన్నారు. అలాగే, నియోజకవర్గంలోని నాలుగు మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన కోసం మరో రూ.200 కోట్లను కేటాయించాలని ఎమ్మెల్యే కోరగా తప్పనిసరిగ్గా నిధులను మంజూరు చేస్తానని హామీచ్చారు. నియోజకవర్గంలో 23 శాతం దళితులున్నారని స్పెషల్ కేస్ కింద పది వేల మందికి దళితబంధు ఇప్పించాలని కోరారు.
జాపాల-రంగాపూర్ అబ్జర్వేటరీలో ఉన్న 200 ఎకరాల్లో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్తోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. తెలంగాణ ప్రజల బాగోగుల కోసం నిరంతరం శ్రమించే ముఖ్యమంత్రిని మరోసారి గెలిపించుకుని తెలంగాణ ప్రజలు రుణం తీర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, మంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీచైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, నోముల కృష్ణగౌడ్, కొత్తకుర్మ సత్తయ్య, ఎంపీపీలు నర్మద, కృపేశ్, జడ్పీటీసీ జంగమ్మ, మున్సిపల్ వైస్ఛైర్మన్లు యాదగిరి, కళమ్మ, మాజీ మేయర్ రామ్మోహన్, మండల పార్టీ అధ్యక్షుడు బుగ్గరాములు, రమేశ్గౌడ్, రమేశ్, కిషన్గౌడ్, వెంకట్రెడ్డి, జంగయ్య, అమరేందర్రెడ్డి, వైస్ఎంపీపీ ప్రతాప్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సీఎం సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఇబ్రహీంపట్నంలో జరిగిన ముఖ్యమంత్రి ప్రజాఆశీర్వాద సభలో బీఆర్ఎస్లో చేరారు. మంచాల మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అండెం విష్ణువర్ధన్రెడ్డి, మంచాల మాజీ సర్పంచ్ గిరిధర్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు అనిరెడ్డి కర్నాకర్రెడ్డి, ముదిరాజ్ సంఘం నియోజకవర్గాధ్యక్షుడు భిక్షపతి, అలాగే, బీజేపీకి చెందిన లోయపల్లి సర్పంచ్ అనితానర్సింహాగౌడ్లతోపాటు ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ మరోసారి కూడా విజయం సాధించ టం పక్కా అని అన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోని కాంగ్రెస్కు ఓటేసి కష్టాలు తెచ్చుకోవద్దన్నారు.