ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెంలో టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు సిద్ధంకి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 257 మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు యువకులు, విద్యార్థులు రక్తదానం చేశారు. శిబిరానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, ప్రశాంత్కుమార్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య, టీఆర్ఎస్ తుర్కయాంజాల్ మున్సిపల్ అధ్యక్షుడు అమరేందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. గురువారం సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు గ్రామగ్రామాన కన్నుల పండువగా నిర్వహించాలన్నారు. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.
మొయినాబాద్ : బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్న సీఎం కేసీఆర్కు అండగా ఉండాల్సిన అవసరం ఉందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. టీఆర్ఎస్ మండల కమిటీ, రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, తహసీల్దార్ అనిత, ఎంపీడీవో సంధ్య, ఆర్ఐ పాండుగౌడ్, మాజీ జడ్పీటీసీ అనంతరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు శ్రీహరియాదవ్, మాజీ ఎంపీపీ పాండుగౌడ్, సర్పంచ్లు నరోత్తంరెడ్డి, రాఘవరెడ్డి, కుమార్, కె రత్నం, రాజు, ఎంపీటీసీలు అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
షాద్నగర్టౌన్ : తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రాష్ర్టానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వెంకట్రాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, నర్సింహ, రాజు, శ్రీనివాస్, సర్వర్పాషా, గ్రంథాలయ డైరెక్టర్ గోపాల్, నాయకులు వంకాయల నారాయణరెడ్డి, మన్నె నారాయణయాదవ్, యుగేందర్, శివశంకర్, రవి, రాఘవేందర్, యాదగిరి, భాస్కర్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
కేశంపేట : తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎంపీపీ వై.రవీందర్యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మెహిదీపట్నం రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 30 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాండ్ర విశాల, మార్కెట్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ విశ్వనాథం, సర్పంచ్లు వెంకట్రెడ్డి, నవీన్కుమార్, రాములునాయక్, ఎంపీటీసీ మల్లేశ్యాదవ్, నాయకులు యాదగిరిరావు, ప్రభాకర్రెడ్డి, శ్రావణ్రెడ్డి, పర్వత్రెడ్డి, వెంకన్నయాదవ్, శ్రీనివాస్, భూపాల్రెడ్డి, యాదయ్యగౌడ్, చంద్రశేఖర్, రమేశ్ పాల్గొన్నారు.
శంకర్పల్లి : సీఎం కేసీఆర్ కారణ జన్ముడని ఎంపీపీ గోవర్ధన్రెడ్డి అన్నారు. మొయినాబాద్లో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో గోపాల్, వాసుదేవ్కన్నా, భరత్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సాయికిరణ్రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
షాబాద్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అవినాశ్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, పీఏసీఎస్ చైర్మన్ శేఖర్రెడ్డి, నాయకులు శ్రీనివాస్గౌడ్, మతీన్, రాజేందర్, వెంకట్, వెంకటయ్య పాల్గొన్నారు.