కొందుర్గు : ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే గ్రామంలో ఆనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందిన బాధితులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను షాద్నగర్ పట్టణంలోని మండలపరిషత్ కార్యాలయంలో గురువారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయనిధి నిరుపేదల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పిస్తుందన్నారు. మండలంలోని ఆంజనేయులుకు రూ. 60వేలు, ఈశ్వరయ్యగౌడ్కు రూ. 56వేలు, రమేశ్కు రూ. 40వేలు, బీమమ్మకు రూ. 16 వేలు మంజూరు అయ్యాయని తెలిపారు. చెక్కులను అందుకున్న బాధితులు, నాయకులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.