రంగారెడ్డి, మార్చి 24 (నమస్తే తెలంగాణ)/వికారాబాద్: ఎండాకాలంలో అగ్ని ప్రమాద ఘటనలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్లు, అధికారులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, పట్టణ ప్రాంతాల్లో రెండు ప డక గదుల నిర్మాణం, 58, 59, 76, 118 ప్రభుత్వ జీవోల ప్రకారం చేయవలసిన క్రమబద్ధీకరణ, పోడు భూములు, తెలంగాణకు హరి తహారం, టెన్త్, ఇంటర్ పరీక్షలపై సమీక్షించారు. పెండింగ్ పట్టాలను మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని.. 59కు సంబంధించి క్రమబద్ధీకరణ రుసుమును వసూలు చేసి పట్టాలు పంపిణీ చేయాలన్నారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లాలో మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ ముగియడంతో ఈ నెల చివరి లోపు జీవో నంబర్లు 58, 59, 76, 118 అమలు చేస్తామన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు సజావుగా సాగుతున్నాయని.. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రా రంభం కానున్న పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామన్నారు. జిల్లాలో 226 పరీక్షా కేంద్రాల ద్వారా 49,574 మంది రెగ్యులర్ విద్యార్థులు, 729 మంది సప్లిమెంటరీ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది అం దుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని.. పరీక్ష జరిగే సమయంలో సజావుగా విద్యుత్ సరఫరా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు తిరుపతిరావు, ప్రతీక్జైన్, జిల్లా ఇంటర్ విద్యాధికారి వెంక్యానాయక్, డీఈవో సుశీందర్రావు, జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారి రామేశ్వరిదేవి, ఎస్సీ శాఖ అభివృద్ధి అధికారి రామారావు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అదేవిధంగా వికారాబాద్ జిల్లా నుంచి కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్కుమార్, డీఆర్డీవో కృష్ణన్, జిల్లా వైద్యాధికారి పాల్వన్కుమార్, ఉద్యానవన శాఖ అధికారి చక్రపాణి, ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ శంకర్నాయక్, డీఈవో రేణుకాదేవి, వికారాబాద్ ఆర్డీవో విజయకుమా రి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోఠాజీ, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, ఫైర్, ఫారెస్టు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.