హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తేతెలంగాణ): ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పాడి రైతులను ఆదుకొని, పాల దిగుబడులు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు విజయడెయిరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 16 నుంచి విజయ డెయిరీకి పాలు విక్రయించే పాడి రైతులకు ప్రస్తుతం చెల్లిస్తున్న ధరపై మరో రూ.1.50 అదనంగా పెంచాలని విజయ డెయిరీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఆగస్టు 2న లీటర్కు రూ.2 ప్రీమియం పెంచామని, దీంతో లీటరు రూ.39 చెల్లిస్తున్నట్టు చెప్పారు. ఆగస్టు 16 నుంచి మరో రూ.1.50 పెంచడంతో లీటర్కు రూ.41 చెల్లించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మూడు నెలల పాటు ఈ పెంచిన ధరలను రైతులకు చెల్లిస్తామని వెల్లడించారు.