ఇబ్రహీంపట్నం రూరల్, ఆగష్టు 7 : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో మంది పేద ప్రజలకు వరంగా మారిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామానికి చెందిన డేరంగుల రాకేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో చికిత్స చేయించుకోగా.. సుమారు లక్ష వరకు ఖర్చు అయ్యాయి.
ఎమ్మెల్యే సహకారంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి రూ.30వేలు మంజూరయ్యాయి. ఆ చెక్కును ఎమ్మెల్యే ఆదివారం క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేస్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డేరంగుల సత్యనారాయణ, నాయకులు గోపి, గోవర్ధన్రెడ్డి, శివశంకర్, ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.