పరిగి, ఫిబ్రవరి 19 ః మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సోమవారం పరిగి పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. కొడంగల్ చౌరస్తా నుంచి ఊరేగింపు ప్రారంభమై పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి ఊరేగింపులో పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
పట్టణంలో జరిగిన ఊరేగింపులో పెద్ద సంఖ్యలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తాండూరు: తాండూరు పట్టణంలో హిందూ ఉత్సవ కేంద్ర సమితి, భజరంగళ్, విశ్వహిందూ పరిషత్, హిందూ జనజాగృతి, హిందూ వాహిని ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు శ్రీ కాళికాదేవి ఆలయం నుంచి శివాజీ చౌక్లోని శివాజీ విగ్రహం (సభ స్థలం) వరకు వందలాది మందితో శోభాయాత్రను నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే బుయ్యనిమనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందన్నారు. దేశానికి శివాజీ చేసిన సేవలు మరవలేవన్నారు. దేశం, ధర్మం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, రాజకీయ పార్టీల నేతలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వికారాబాద్: పరమతాలను గౌరవిస్తూ.. హిందు మత స్థాపనకు ఛత్రపతి శివాజీ చేసిన సేవలు, కృషి మరువలేనిదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు.
సోమవారం వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంలో చత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విశ్వేశ్వర్రెడ్డితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, నాయకుడు నవీన్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామంలోని యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఛత్రపతి శివాజీ జీవితం భావి తరాలకు స్ఫూర్తి దాయకమని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు.
సోమవారం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మద్గుల్ చిట్టెంపల్లిలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన నూతన శివాజీ విగ్రహానికి వికారాబాద్ ఆనంద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, కౌన్సిలర్లు గోపాల్, అనంత్రెడ్డి, నవీన్కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కులకచర్ల: ఛత్రపతి శివాజీ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు.
సోమవారం మండల పరిధిలోని పుట్టపహాడ్లో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సాధనలో ఛత్రపతి శివాజీ చేసిన సాహసాలను వివరించారు. శివాజీ దేశభక్తుడని తన పరిపాలనలో గుడులను మాత్రమే కాకుండా మసీదులను కూడా కట్టించారన్నారు. శివాజీ రాజనీతి చాలా గొప్పదని కొనియాడారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత భాస్కర యోగి జడ్పీటీసీ రాందాస్నాయక్, వైస్ ఎంపీపీ రాజశేఖర్గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాద్రావు, మండల నాయకులు పీరంపల్లి రాజు, హరికృష్ణ, మాలె కృష్ణయ్యగౌడ్, రాజప్ప, వీరారెడ్డి, పుట్టపహాడ్ శివాజీ యువజన సం ఘం సభ్యులు, గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
మర్పల్లి: మండల కేంద్రంతో పాటు, కోటమర్పల్లి, పట్లూర్, కొంషట్పల్లి, పంచలింగాల్, దామస్తాపూర్, గుండ్లమర్పల్ల్లి, సిరిపురం, కల్కోడా, ఘనాపూర్, బూచన్పల్లి తదితర గ్రామాలలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శివాజీ అడుగుజాడల్లో నడువాలని సూచించారు. మర్పల్లిలోశోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి యువజన సంఘం సభ్యులు, నేతలు పాల్గొన్నారు.
దోమ: దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని సోమవారం హిందూవాహిని, వీహెచ్పీ సంస్థల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉన్న శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో హిందూవాహిని, వీహెచ్పీల కార్యకర్తలు, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
బొంరాస్పేట: ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో యువత నవ సమాజ నిర్మాణానికి పాటు పడాలని వికారాబాద్ సిద్దార్థ కళాశాల ప్రిన్సిపాల్ జయదేవ్ అన్నారు. సోమవారం దుద్యాల మండలంలోని పోలపల్లి గ్రామం లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతిలో ఆయన పాల్గొన్నారు.
సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఆయన పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన ధీరుడని, ఎన్నో యుద్ధాలు చేసిన హింసను ప్రోత్సహించలేదని, మత సామరస్యాన్ని చాటారని అన్నారు. అంతకు ముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
పెద్దేముల్ : నేటి సమాజంలో యువత ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని ప్రముఖ న్యాయవాది ఎల్లారెడ్డి, శివాజీ యువజన సంఘం మండల అధ్యక్షుడు బంగ్ల రఘు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని శివాజీనగర్ కాలనీలో శివాజీ జయంతి వేడుకలను స్థానిక నాయకులు, యువకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రిపతి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎల్లారెడ్డి, ఆనందం, చారి, డీవై నర్సింహులు, శేఖర్, వెంకట్, రమేశ్, శ్రీను, శివ, బ్రహ్మం, పరిపూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.