చేవెళ్ల సభలో అమిత్షా చేసిన ప్రసంగంలో కొత్తదనం ఏమీలేదని.. ఎప్పటిలాగే పచ్చి అబద్ధాలతో రాష్ట్ర సర్కార్పై బురదజల్లే ప్రయత్నం చేశారని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. కనీసం చేవెళ్లకు ఏదైనా మేలు చేసే ప్రకటన చేస్తారేమోనని చూశామని.. కానీ ఎంతసేపు బీఆర్ఎస్పై ఏడవడమే కనిపించిందన్నారు. సోమవారం చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. గత తొమ్మిదేండ్లలో తెలంగాణకు మెడికల్ కాలేజీ, ఐఐటీ, ఐఏఎం, ఐటీఐఆర్, ఫార్మాసిటీ.. ఇందులో ఏ ఒక్కటైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం ప్రజలపై ఎనలేని భారం మోపుతూ దేశాన్ని సంక్షోభం వైపు నడిపిస్తున్నదన్నారు. బీజాపూర్ హైవేకు నిధులిచ్చామని, భూసేకరణ చేయడంలేదని అమిత్షా ఆరోపణలు చేశారన్నారు. ఇప్పటివరకు 77శాతం వరకు భూసేకరణ పూర్తయిందన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తున్నదన్నారు. రాష్ట్ర సర్కార్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు కళకళలాడుతున్నాయన్నారు. దీని ఫలితంగా పలు గ్రామాలకు పురస్కారాలు వస్తున్నాయన్నారు. ‘పల్లెప్రగతి’తో తెలంగాణ రాష్ర్టానికి 30శాతం జాతీయ అవార్డులు అందాయని తెలిపారు.
-షాబాద్, ఏప్రిల్ 24
షాబాద్, ఏప్రిల్ 24 : చేవెళ్లలో జరిగిన అమిత్షా బహిరంగ సభలో కొత్తదనం ఏమీలేదని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి అన్నారు. సోమవారం చేవెళ్ల లోని కేజీఆర్ గార్డెన్లో ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డితో కలిసి ఎంపీ విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందకుండా చేస్తున్నారని పేర్కొనడం సరికాదన్నారు. గత తొమ్మిదేండ్లలో తెలంగాణకు మెడికల్ కాలేజీ, ఐఐటీ, ఐటీఐఆర్, ఫార్మాసిటీ ఇందులో ఏ ఒక్కటైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.
కేసీఆర్ సంక్షేమం అంటే…కేంద్రంలోని బీజేపీ మా త్రం సంక్షోభం అంటున్నదని ఆరోపించారు. మతాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకే బీజేపీ నాయకులు తెలంగాణకు వస్తున్నారని విమర్శించారు. చేవెళ్ల సభలో ఏదైనా పథకాన్ని కానీ.. నిధులను కానీ ఈ ప్రాంతాభివృద్ధికి అమిత్షా మం జూరు చేస్తున్నట్లు ప్రకటిస్తారని భావించగా.. ఆ మాటలు కాకుండా పదేపదే బీఆర్ఎస్పై ఆరోపణలు చేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయా అని ఎంపీ రంజిత్రెడ్డి ప్రశ్నించారు.
అమిత్షా బీజాపూర్-హైదరాబాద్ హైవే గురించి మాట్లాడుతూ ఐదేండ్లలో భూసేకరణ చేయలేదని పేర్కొన్నారని ..కానీ ఇప్పటివరకు 77శాతం వరకు పూర్తైందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడకముందు తెలంగాణకు కేంద్రం నుంచి ఏడాదికి రూ.30వేల కోట్లు మాత్రమే వచ్చేవని, 2022-23లో రూ.1.20 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్ షా పేర్కొన్నారని.. కానీ ఇప్పటివరకు కేటాయింపులు రూ.30 వేల కోట్లు కూడా దాటలేదన్నారు. ముస్లిం రిజర్వేషన్ బిల్లును రద్దు చేసి.. ఎస్సీ, ఎస్టీ ల రిజర్వేషన్లు పెంచుతామని కేంద్ర హోం మంత్రి ప్రకటించారని.. అయితే తెలంగాణ ప్రభుత్వం జనాభా లెక్కల ప్రకారం ఇప్పటికే రిజర్వేషన్లను పెంచుకుంటూ పోతున్నదన్నారు. మోదీ ప్రభు త్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు జాతీయ హోదా ఇవ్వడం లేదన్నారు. గత వారం క్రితమే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించినట్లు ఆయన చెప్పారు.
కేంద్ర హోంమంత్రి గతంలో మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్ర పర్యటనలో అబద్ధాలు చెప్పారన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కావడం దురదృష్టకరమని .. ఆ పరీక్షను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసి జూన్ లో నిర్వహిస్తామని చెప్పిందన్నారు. పదోతరగతి పేపర్ లీక్ కాలేదా అని బీజేపీ నాయకులు అంటున్నారని.. 13 సార్లు పేపర్ లీకైన గుజరాత్ ప్రభుత్వాన్ని ఎందుకు బర్తరఫ్ చేయలేదన్నారు. తెలంగా ణ ప్రభుత్వం ఇప్పటికే దానిపై సిట్ను ఏర్పాటు చేసిందని.. ఆ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరడం సరైంది కాదన్నారు. ఉత్తర్ప్రదేశ్లో ఎన్కౌంటర్ అయితే అక్కడ సిట్ను ఏర్పాటు చేస్తే నమ్ముతున్నా మీరు.. తెలంగాణ పోలీసులను ఎం దుకు నమ్మరని ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే భద్రత ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం లోనే ఉందన్నారు. 7 లక్షల సీసీ కెమెరాల నిఘాతో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసుకుని పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అమిత్షా ఒకసారి కమాండ్ కంట్రో ల్ రూమ్కెళ్లి చూస్తే తెలుస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మోదీ ప్రభుత్వం రూపాయి కూడా కేటాయించలేదని.. తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతో నిర్మించిందన్నారు. తెలంగాణ ప్రజలు మీరు ఏమైనా అభివృద్ధి పనులు చేసి చెబితే నమ్ము తారని.. అబద్ధాలు చెబితే విశ్వసించారన్నారు. బీఆర్ఎస్పై అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం సహించేదిలేదని ఆయన హెచ్చరించారు.
తొమ్మిదేండ్లుగా జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకే పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహి స్తున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో సంక్షేమ పాలన సాగుతున్నదని.. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్ర సర్కార్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు కళకళలాడుతున్నాయన్నా రు. దీని ఫలితంగా పలు గ్రామాలకు పురస్కారాలు వస్తున్నాయన్నారు. ‘పల్లెప్రగతి’తో తెలంగాణ రాష్ర్టానికి 30శాతం జాతీయ అవార్డులు అం దాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీలు విజయలక్ష్మి, గోవర్ధ్దన్రెడ్డి, జడ్పీటీసీలు కాలె జయమ్మ, శ్రీకాంత్, గోవిందమ్మ, పీఏసీఏస్ చైర్మన్ పోలీస్ రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రశాంత్గౌడ్, పాపారావు, బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు ప్రభాకర్, నర్సింగ్రావు, మహేందర్రెడ్డి, గోపాల్, రమణారెడ్డి, గోపాల్రెడ్డి, నాగార్జునరెడ్డి, నర్సింహులు, వెంకట్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.