తాండూరు, ఏప్రిల్ 8 : చేవెళ్ల గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా అని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పంజుగుల శ్రీశైల్రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో రెండుసార్లు చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారని.. త్వరలో జరుగనున్న ఎన్నికల్లోనూ కాసాని జ్ఞానేశ్వర్ ఘన విజ యం సాధించడం ఖాయమన్నారు. సోమవారం తాండూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కరువు రాజ్యమేలుతున్నదని.. తప్పుడు హామీలతో గద్దెనెక్కి ప్రజలను నట్టేట ముంచుతున్నదని మండిపడ్డారు.
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 209 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ సీఎం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపితే.. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రైతులు గోస పడేలా చేశారని ఆరోపించారు. చేవె ళ్ల అభ్యర్థులుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ప్రస్తుతం బరిలో ఉన్న విశ్వేశ్వర్రెడ్డి, రంజిత్రెడ్డిలను గులాబీ సైనికులు గత ఎన్నికల్లో కష్టపడి గెలిపిస్తే మోసం చేసి పార్టీలు మారార ని మండిపడ్డారు.
నమ్మక ద్రోహం చేసిన వారికి రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని…కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పి లుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్లలో 13వ తేదీన నిర్వహించనున్న బీఆర్ఎస్ (కేసీఆర్) బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు తాండూరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలన్నారు. అనంతరం గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజూగౌడ్, తాండూరు బీఆర్ఎస్ సీనియర్ నేతలు మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నత పదవులు అనుభవించిన నాయకులు నేడు పార్టీలు మారడం విడ్డూరంగా ఉందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమైన వారిని ఎప్పటికీ గెలవనివ్వమని హెచ్చరించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను మోసం చేసిన ద్రోహులను చిత్తుగా ఓడిస్తామన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు తాండూరు సెగ్మెంట్ నుంచి లక్షకుపైగా మెజార్టీ వచ్చేలా కృషి చేస్తామన్నారు. 13న నిర్వహించనున్న చేవెళ్ల బహిరంగ సభను విజయవంతం చేయాల న్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్యనేతలు నయీం, నర్సిరెడ్డి, రవీందర్రెడ్డి, శ్రీనివాసాచారి, వీరేందర్రెడ్డి, నర్సింహులు, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.