చేవెళ్ల రూరల్ : గ్రామాలకు అధిక నిధులు మంజూరు చేసి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నామని ఎంపీ రంజిత్రెడ్డి పేర్కొన్నారు. గొల్లగూడ, ఎంకేపల్లి, ఈర్లపల్లి గ్రామాలకు సీసీరోడ్ల నిర్మాణానికి ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా రూ. 30 లక్షలు ఒక్కో గ్రామానికి రూ. 10లక్షల చొప్పున మంజూరయ్యాయి. వాటికి సంబంధించిన మంజూరు పత్రాలను శుక్రవారం ఎంపీ రంజిత్రెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్రెడ్డి, గొల్లగూడ, ఎంకేపల్లి, ఈర్లపల్లి గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులకు అందజేశారు. గత కొన్ని రోజుల కింద నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ప్రజా ప్రతినిధులు ఎంపీ రంజిత్రెడ్డిని కలిసి గొల్లగూడ, ఎంకేపల్లి, ఈర్లపల్లి గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు.
దీంతో ఎంపీ రంజిత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నిధుల మంజూరుకు కృషి చేయడంతో నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు ఎంపీ రంజిత్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గొల్లగూడ గ్రామ సర్పంచ్ రాంచంద్రయ్య, ఉప సర్పంచ్ విఠలయ్య, ఎంకేపల్లి ఉప సర్పంచ్ లక్ష్మయ్య, దేవదాస్, గుజ్జులయ్య, వార్డు సభ్యులు నర్సింలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.