చేవెళ్ల టౌన్ : పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంలాంటిదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధారురు మండలం ఓసుపల్లి గ్రామానికి చెందిన మల్లేష్కు ముఖ్యమంత్రి షహాయనిధి కింద మంజూరైన రూ. 3లక్షల యాభై వేల చెక్కు ఎమ్మెల్యే యాదయ్య బాధితుడికి అందజేశాడు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి ఆపద్బందువులా ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికీ సీఎం సహాయనిధి ద్వారా ఎంతోమంది నిరుపేదలకు వైద్య సేవలకు సహకారం చేయడం జరిగిందన్నారు.
గతంలో పేదవారిని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పేదలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.