బొంరాస్పేట, మే 17 : మండలంలోని బొట్లవానితండాలో వెలసిన మారెమ్మ, సేవా లాల్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం మూడో రోజు ఉదయం పురోహితుడు జోషి సత్యనారాయణరావు ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాభిషేకం, చంఢీహోమం నిర్వహించారు. అనంతరం మారెమ్మ, సేవాలాల్ ఉత్సవ విగ్రహాలకు ఆలయ చైర్మన్ చందర్నాయక్ పూజలు చేసి పల్లకిలో విగ్రహాలను ఉంచి తండాలోని వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.
ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ చౌహాన్ అరుణాదేశు, గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలు ఎత్తుకుని పల్లకి సేవ ఊరే గింపులో పాల్గొన్నారు. దేవాలయానికి చేరుకున్న తరువాత నైవేద్యం సమర్పించి అమ్మ వారికి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు సంప్రదాయ నృత్యాలు చేసుకుంటూ ఊరేగింపులో పాల్గొన్నారు. తండా ప్రజలు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అన్నదానం నిర్వహించారు.కార్యక్రమంలో ఎంపీటీసీ తిరుపతయ్య, టీఆర్ఎస్ నాయ కులు రాజేశ్వర్రెడ్డి, మోనా చారి, నెహ్రూనాయక్, శంకర్నాయక్, బాలనాయక్ తది తరులు పాల్గొన్నారు.ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి