పరిగి, ఏప్రిల్ 13 : ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్డు సదుపాయం కల్పించేందుకు ప్రభు త్వం కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పల్లెబాట కార్య క్రమంలో భాగంగా గురువారం పరిగి మండలంలోని ఇబ్రహీంపూర్, రూప్సింగ్ తండా మల్కాయ్పేట్తండా, సాలిప్పలబాటతండా, రూప్ఖాన్పేట్, సుల్తాన్పూర్, లక్ష్మీ దేవిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించడంతోపాటు ఆయా గ్రామాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు గిరిజనతండాల బీటీ రోడ్లకు రూ.14.89కోట్లు మంజూరు కాగా పరిగి మండలంలోని హన్మ్యానాయక్, మల్కాయ్పేట్, సుల్తాన్పూర్, గోవిందాపూర్, రాంరెడ్డిపల్లి, కాళ్లాపూర్తండాల బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.5.50కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. విడుతల వారీగా అన్ని గిరిజనతండాలకు బీటీ రోడ్ల నిర్మాణం చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రతి గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రత్యేకంగా తండాలను గ్రామపంచాయతీలుగా చేయడం ద్వారా నిధులు ఆయా గ్రామ పంచాయతీ లకు వెళ్తున్నాయని, తద్వారా అభివృద్ధి జరుగుతున్నదని చెప్పారు. మల్కాయ్పేట్తండా లో మంచినీటి కోసం ప్రత్యేకంగా బోరు వేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రతి గ్రా మపంచాయతీలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10లక్షల చొప్పున మంజూరు చేయిస్తున్నా మని వాటితో అవసరమైన చోట రోడ్ల నిర్మాణం చేపట్టాల్సిందిగా సర్పంచ్లకు సూచిం చారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో చాలావరకు నెరవేర్చామని, మిగిలిన వాటిని సాధ్యమైనంత త్వరగా నెరవేరుస్తామని చెప్పారు.
కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, పీఏ సీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాం సుందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకుడు ప్రవీణ్ కుమార్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.