షాద్నగర్టౌన్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎంఎస్ నటరాజ్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరై విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను దేశానికే దిక్సూచిగా నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. నిరంతం పేద ప్రజల అభ్యన్నతికి కట్టుబడి పని చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు చెట్ల పావని, ప్రేమలత, ప్రతాప్రెడ్డి, శారద, కౌసల్య, మాధురి, నాయకులు యుగేందర్, జూపల్లి శంకర్, నర్సింహులు, శేఖర్, నందకిశోర్, సలీం, రవి, శ్రీను, రాఘవేందర్, శివాజీనాయక్, అశోక్, మల్లేశ్, అశోక్, వెంకటేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదినం సందర్భంగా శనివారం ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు.కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్, నాయకులు కాల్లె గణేశ్, దేవేందర్గౌడ్, బీరప్ప, మైసయ్య, శేఖర్, శ్రీశైలం, దేవదాసు, అంజయ్య, సాయి తదితరులున్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్కుమార్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం అంధుల ఆశ్రమంలో కేక్ కట్చేసి పండ్లను పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజు, వినోద్, శివ, వీరేశ్, కాజు, కరుణాకర్, జలందర్, దయాచారి, గిరి, సంపత్, సాయి తదితరులున్నారు.
ఆమనగల్లు : ఆమనగల్లు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోనుగోటి అర్జున్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జడ్పీటీసీ అనురాధతో కలిసి కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో నాలపురం శ్రీనివాస్ రెడ్డి, పత్యానాయక్, నిరంజన్గౌడ్, సయ్యద్ ఖలీల్, పరమేశ్, రమేశ్, బాలస్వామి, కొమ్ము ప్రసాద్, సతీశ్, విక్రమ్, యాదయ్య, వెంకటయ్య, సుమన్, దేవేందర్, చెన్నకేశవులు పాల్గొన్నారు.
శంకర్పల్లి : మున్సిపాలిటీ పరిధిలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమం ప్రవీణ్కుమార్, శశిధర్రెడ్డి, వాసుదేవ్ కన్నా, పాపారావు, గోపాల్రెడ్డి, అశోక్, ఫరీద్, శ్రీనాథ్, ఇంద్రసేనారెడ్డి, మధు, రఘునందన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కడ్తాల్ : కడ్తాల్, తలకొండపల్లి మండలాల్లోని గ్రామాలు, తండాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. రావిచేడ్ గ్రామంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బొప్పిడి గోపాల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రమేశ్యాదవ్, మాజీ ఎంపీటీసీ వసంత, నాయకులు బాలకృష్ణ, జితేందర్రెడ్డి, పవన్కుమార్, రవి, మల్లేశ్యాదవ్, యాదయ్య, కృష్ణయ్య, మహేశ్, శ్రీశైలంయాదవ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
నందిగామ : మండల కేంద్రంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి, రాష్ర్టానికి ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ దార సురేశ్, నాయకులు తుప్పుడు నర్సింహ, కృష్ణ, భీంరెడ్డి, నర్సింహ, సురేందర్రెడ్డి పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : కేసీఆర్ జన్మదినం సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆయయను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఎదిరె రాములు మాజీ సీఎం కేసీఆర్ను ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.