కేశంపేట, నవంబర్ 03 : తెలంగాణపై సవతితల్లి ప్రేమను చూపుతున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల మాయ మాటలను ప్రజలు నమ్మొద్దని షాద్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని సంగెం, పుట్టోనిగూడ, కంకరాళ్లతండా, వేములనర్వ, చింతకుంటపల్లి, బలిజరాళ్లతండా, నాగుర్లగడ్డతండా, సుందరాపూర్, కాకునూర్ గ్రామాల్లో శుక్రవారం అంజయ్యయాదవ్తో పాటు నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అంజయ్యయాదవ్కు ఆయా గ్రామాల్లో మహిళలు, ప్రజలు ఘనంగా మంగళ హారతులు, పూలదండలతో స్వాగతం పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలను మభ్యపెట్టి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నాయని, గతంలో దేశాన్ని 55 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, పదేండ్లుగా పాలిస్తున్న బీజేపీలు రాష్ట్రంలో చేసిన అభివృద్ధ్ది ఏమీ లేదన్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆటలు, పాటలతో ప్రచారాన్ని హోరెత్తించారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీష్వ కిష్టయ్య, సర్పంచ్లు రేణుక, జగన్నాయక్, పార్వతమ్మ, రాములునాయక్, లక్ష్మమ్మ, పీఏసీఎస్ అధ్యక్షుడు జగదీశ్వర్గౌడ్, వైస్ ఎంపీపీ అనురాధ, మండల కోప్షన్ మెంబర్ జమాల్ఖాన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, నాయకులు రాంబల్నాయక్, నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణగౌడ్, గోపాల్రెడ్డి, పల్లె నర్సింగ్రావు, యాదగిరిరావు, పర్వత్రెడ్డి పాల్గొన్నారు.
నందిగామ : బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన నాయకులు, కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. చేగూరు గ్రామానికి చెందిన నందిగామ ఎంపీపీ ప్రియాంక శివశంకర్గౌడ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో చేగూరు ఉమ్మడి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ను శుక్రవారం కలిసి సంపూర్ణ మద్దతు పలికారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారే నాయకులతో పార్టీకి ఎలాంటి నష్టం జరగదని, చేగూరు ఉమ్మడి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి సైనికుల్లా పని చేసే కార్యకర్తలు ఉన్నారని, గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ది చేసిన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ను భారీ మెజారిటితో గెలించుకుంటామని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, సర్పంచ్లు జట్ట కుమార్, బుయ్యని రజనీతా వీరెందర్గౌడ్, బండి నీలమ్మ, సంతోష, చేగూరు పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, ఉప సర్పంచ్లు మధుగౌడ్, అంజమ్మగౌడ్, వార్డు సభ్యులు భాస్కర్గౌడ్, పెబ్బె రవి, దేవప్ప, శ్రీను, నాయకులు బుగ్గ నర్సింహ, మల్లేశ్, సాములయ్య, శ్రీనివాస్చారి సురేశ్గౌడ్, శివగౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : చేవెళ్ల మండల పరిధిలోని గ్రామాల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తంగడిపల్లి, మడికట్టు, తల్లారం, దుద్దాగు గ్రామాల్లో ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, జడ్పీటీసీ మాలతీకృష్ణారెడ్డి, సర్పంచ్లు అనూష, గూడెం సురేందర్తో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఓట్లు అడిగే అర్హత లేదని, బీఆర్ఎస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
ప్రజల మనిషి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అభ్యర్థి కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శివ ప్రసాద్, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, నాయకులు బాల్రాజ్, కృష్ణారెడ్డి, ఎదిరె రాములు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శేరి శివారెడ్డి, శివనీలచింటు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి, రామాగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు రాఘవేందర్రెడ్డి పాల్గొన్నారు.
శంకర్పల్లి, నవంబర్ 3 : సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 2, 3, 7, 11, 12, 13, 14, 15వ వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ విజయలక్ష్మీ ప్రవీణ్కుమార్, ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాపారావు, సర్పంచ్ సత్యనారాయణ, నర్సింహారెడ్డి, నాయకులు వెంకట్రెడ్డి, గోపాల్, వాసుదేవ్ కన్నా పాల్గొన్నారు.
కొత్తూరు : అంజయ్యయాదవ్ హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని కొత్తూరు తండా, వింటేజ్ వెంచర్, వినాయక కెమికల్స్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షాద్నగర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. కొత్తూరు మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు.
కారుగుర్తుకు ఓటేసీ బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్యయాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులు కోరారు. కార్యక్రమలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్ కొస్గి శ్రీనివాసులు, ఎంపీటీసీ రాజేందర్గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవేందర్యాదవ్, దయానంద్గౌడ్, బ్యాగరి యాదయ్య, వెంకటేశ్, రవినాయక్, జోగుబాల్రాజు, బి రాజు, రాఘవేందర్ యాదవ్, శ్రావణ్కుమార్, శంకర్, లక్ష్మయ్య, నరసింహా,
షాద్నగర్టౌన్ : తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్ అన్నారు. మున్సిపాలిటీలోని 11,12వ వార్డులో కౌన్సిలర్లు అంతయ్య, జీ.టీ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. షాద్నగర్ జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ కారుగుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనాడు ప్రజల క్షేమం గురించి ఆలోచన చేయలేదని, కేవలం ఓట్ల కోసం మాత్రమే ఇంటింటికీ తిరుగుతూ మాయమాటలు చెబుతున్నారని అన్నారు. అదేవిధంగా ఫరూఖ్నగర్ మండలం క మ్మదనంలో సర్పంచ్ నర్సింహులు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు సుధాకర్, శేఖర్, పాండురంగారెడ్డి, దిలీప్, సురేందర్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, కిరణ్కుమార్గౌడ్, హన్మంత్రెడ్డి, శ్రీకాంత్యాదవ్, శ్రీను, రవి, వెంకటేశ్ పాల్గొన్నారు.