రంగారెడ్డి, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్నది. ఇందుకో సం పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నది. గురువారం తెలంగాణభవన్లో మహబూబ్నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగింది.
దీనికి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తాచాటాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మహబూబ్నగర్ ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ 2009 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నదని.. ఈసారి కూడా గెలిచేలా పార్టీ శ్రేణు లు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలకు సంబంధించిన బుక్లెట్లను సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ అందజేశారు. ఈ సందర్భంగా షాద్నగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యామని, పార్టీ శ్రేణులు నిరాశ చెందొద్దని సూచించారు. లోక్సభ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొస్తామన్న కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొద్ది రోజుల్లోనే అనేక వర్గాలు అసంతృప్తితో ఉన్నాయన్నాయని..ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడే రోజులు మళ్లీ వచ్చాయని.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేసేలా ప్రజలను చైతన్యపర్చాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆరు నెలల్లో ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు.
పదేండ్లు రాష్ర్టాభివృద్ధికి కృషి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ దుష్ప్రచారానికి తెరలేపిందని..బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు కాదు కోట్లాది రూపాయల ఆస్తులను సృష్టించింద ని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గ్గోట్టేందుకే కాంగ్రెస్ శ్వేతపత్రాలతో నాటకాలు మొదలుపెట్టిందని ఆరోపించారు. పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ను పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
గెలిచినప్పుడు పొంగిపో లేదని.. ఓటమికి కుంగిపోమని..ఎప్పుడైనా ప్రజాప్రయోజనాల కోసమే మన పార్టీ పనిచేస్తుందని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభు త్వంలో పింఛన్ల కోసం ఏటా రూ.800 కో ట్లు ఖర్చు పెడితే, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 11,700 కోట్లను ఖర్చు పెట్టిందన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ నుంచి పార్ల మెంట్ వరకు ప్రతి చోటా పార్టీకి బలమైన నాయకత్వం ఉన్నదని.. ఇంతటి బలమైన పార్టీ తిరిగి గెలుపుబాట పట్టడం పెద్ద కష్టమేమీకాదని శ్రేణులకు మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు.
సమావేశంలో మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, పట్నం నరేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, మాజీ చైర్మన్ విశ్వం, సహకార సంఘాల మాజీ చైర్మన్ రాజావరప్రసాద్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబాల్నాయక్, కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ నవీన్రెడ్డి, నాయకులు శ్రీనివాస్రెడ్డి, నారాయణరెడ్డి, వెంకట్రెడ్డి, లక్ష్మీనారాయణ, మురళీధర్, లక్ష్మణ్, యాదయ్య, వీరే శం, సాయిప్రసాద్ ,కొడంగల్ నియోజకవర్గ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
పార్లమెంటు ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగానే సమాయత్తమైనది. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్నది. జనవరి 5న చేవెళ్ల, 12న భువనగిరి, 17న నాగర్కర్నూల్, 18న మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను నిర్వహించినది.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, మాజీ మంత్రి హరీశ్రావు తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొని తాజా, మాజీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో గెలుపునకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలతో నైరాశ్యంలో ఉన్న కేడర్లో జోష్ నింపేందుకు సన్నాహక సమావేశాలు ఎంతో దోహదపడ్డాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.