మానవపాడు, ఆగస్ట్టు 9 : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా మారింది నడిగడ్డ రైతుల పరిస్థితి. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలానికి ఒకవైపు కృష్ణానది, మరోవైపు తుంగభద్ర నది ఉన్నా రైతులకు మాత్రం సాగునీరు అందక తల్లడిలుతున్నారు. గతం లో కురిసిన కొద్దిపాటి వర్షానికి రైతులు మిరప, పత్తి పంటలు సాగు చేశారు. అప్పటి నుంచి వర్షం లేకపోవడంతో రైతులు పంటలు ఎండి పోతుండడం చూడలేక పంటలను ఎలా కాపాడుకోవాలని పడరాని పాట్లు పడుతున్నారు. తుంగభద్ర నదికి వరద లేకపోవడంతో రైతులు ఆర్డీఎస్ ద్వారా సాగునీరు అందుతాయన్న ఆశలు వదులుకున్నారు.
మరోవైపు కృష్ణానదిలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ జారాల కుడి కాల్వ ద్వారా సాగునీరు వదలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జూరాల లింక్ ద్వారా సాగునీరు అందితే కొద్ది పాటి పంటలైనా కాపాడుకునే అవకాశం ఉందని తలంచిన రైతులు ఆదివారం ఆర్డీఎస్ డిస్ట్రిబ్యూటరీ-30 జూ రాల లింక్ కాల్వలో రైతులు నిలబడి నిరసన వ్య క్తం చేశారు. జూరా ల లింక్ కాల్వ ద్వారా నీరు అందించి పంటలను కాపాడాలని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జూరాల లింక్ కాల్వ ద్వారా సాగునీరు అందిచకుంటే పెద్ద ఎత్తు న ఆందోళన చేస్తామని హెచ్చరించారు.