వనపర్తి టౌన్, ఆగస్టు 23 : సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ సాహిత్య అకాడమీలో నిర్వహించిన సుప్రసిద్ధ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిదారెడ్డి సాహిత్య సమాలోచన గ్రంథావిష్కరణ సభను ఆదివారం నిర్వహించారు. ఈ సభకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గ్రంథావిష్కర్తగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి గ్రంథాన్ని ఆవిష్కరించి తెలు గు సాహిత్యానికి డాక్టర్ నందిని సిదారెడ్డి అందిస్తున్న సేవలను అభినందించారు. అనంతరం మాజీ మంత్రి నిరంజన్రెడ్డిని నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సుప్రసిద్ధ సాహిత్యవేత్తలు ఆచార్య మృణాళిని, ఆచార్య కోయ కోటేశ్వర్, నాలేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, జయప్రకాశ్ పాల్గొన్నారు.