పరిగి జనవరి 19 : అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్ర మం అమలు చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పరిగి పురపాలక సంఘం పరిధిలోని మల్లెమోనిగూడ, దోమ మండలం బొంపల్లి గ్రామంలో, పూడూరు మండలం చన్గోముల్లో జిల్లా కలెక్టర్ నిఖిల, కులకచర్లలో డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్రెడ్డిలతో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ దేశానికే దిక్సూచిగా ఈ కార్యక్రమం నిలుస్తుందన్నారు. తెలంగాణ వలె ఢిల్లీ, పంజాబ్లలోను కంటి వెలుగు అమలు చేస్తామని ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు ప్రకటించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే మందులు, కళ్లద్దాలు అందజే యడం జరుగుతుందని తెలిపారు. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి మాట్లా డుతూ ప్రతి గ్రామంలో నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమం సద్వినియోగం చేసుకో వాలని అన్నారు. కులకచర్ల మండలం బండెల్కిచర్ల, అంతారంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, పరిగి మండలం చిట్యాల్లో ఎంపీపీ కరణం అరవిందరావు, దోమ మండలం బుద్లాపూర్లో జెడ్పీటీసీ కొప్పుల నాగారెడ్డిలు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పాల్వన్కుమార్, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సుధారాణి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కోటాజీ, ఎంపీపీలు కరణం అరవిందరావు, మల్లేశం, అనుసూయ, సత్యమ్మ, జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, మలిపెద్ది మేఘమాల, రాందాస్, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, కులకచర్ల మార్కెట్ చైర్మన్ బి.హరిక్రిష్ణ, దోమ వైస్ ఎంపీపీ మల్లేశం, ఎంపీడీవోలు శేషగిరిశర్మ, ఉమాదేవి, సర్పంచ్లు మల్లిక, సౌమ్య, శిరీష, కోళ్ల సురేష్, రజిత పాల్గొన్నారు.
జిల్లాలో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ నిఖిల అన్నారు. గురువారం తాండూరు నియోజకవర్గవ్యాప్తంగా ప్రారంభమైన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కంటి పరీక్షల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలను ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, కలెక్టర్ నిఖిల, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, జిల్లా వైద్యాధికారి పాల్వాన్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజూగౌడ్, ఆర్టీవో అశోక్కుమార్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించి పలువురికి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడు తూ ప్రజా ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంద రోజుల కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఏ ఒక్కరు కంటి సమస్యలతో బాధపడకూడదనే దృఢ నిశ్చ యంతో రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు నేడు దేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయటమే తమ లక్ష్యమన్నారు. కంటి పరీక్షలు చేయించు కున్నవారికి అవసరం ఉంటే కళ్లద్దాలను ఇంటికే తెచ్చి ఇస్తామన్నారు. ప్రజల క్షేమం కోసం మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టిన సీఎం కేసీఆర్కు తాండూరు నియోజక వర్గం ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ అంధత్వ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగును జిల్లా ప్రజలంత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వైద్యరంగానికి ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తున్నదని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని సీహెచ్సీ దవాఖానలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కలెక్టర్ నిఖిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వందరోజుల పాటు ఈ కార్యక్రమం కొన సాగనుందన్నారు. కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలంటే ఇంటింటి ప్రచారం చాలా ముఖ్యమన్నారు. కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ అంధత్వ నివారణే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొడంగల్ మండలంలోని ప్యాలమద్ధి గ్రామంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బొంరాస్పేట మండలంలో చిల్ముల్ మైల్వార్లో, బొంరాస్పేటలో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగింది. బొంరా స్పేటలో ఎమ్మెల్యే కంటి వెలుగును ప్రారంభించారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ విజయ్కుమార్, జడ్పీటీసీ కోట్ల మహిపాల్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి వైస్ చైర్మన్ ఉషా రాణి, డీఎంఅండ్హెచ్వో డా.పాల్వన్కుమార్, డిప్యూటీ డీఎంఅండ్ హెచ్వో డా. రవీంద్రయాదవ్, ప్రత్యేకాధికారి విమల, పీఏసీఎస్ అద్యక్షుడు కటకం శివకుమార్తో పాటు కౌన్సిలర్లు సర్పంచ్లు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కంటి వెలుగు చరిత్రలో నిలిచిపోతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని 31వ వార్డు శివ రాం నగర్ కాలనీలో, ధారూరు మండల కేంద్రంలో రెండో విడత కంటి వెలుగు కార్య క్ర మాన్ని అదనపు కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా వికా రాబాద్ పట్టణంలోని 1 ,24, 31 వార్డులలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రా రంభించారు. కోట్పల్లి మండలంలో జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి ప్రా రంభించారు. వికారాబాద్ 1వ వార్డులో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల ప్రారంభించారు. వికారాబాద్ మండలంలోని సిద్దులూర్లో ఎంపీపీ చంద్రకళ, పీలారం గ్రామంలో సర్పంచ్ భారతమ్మలు ప్రారంభించారు. మోమిన్పేట మం డ లం ఎన్కతల గ్రామంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్ ప్రారంభించారు. మర్పల్లి, బంట్వారం మండలాల్లో ఎంపీపీ, జడ్పీటీసీలు ప్రారంభోత్సవం చేశారు. నవాబుపేట మండలంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ కంటి పరీక్షలు చేయించుకోవడంలో అపోహలు పెట్టుకోవద్దన్నారు. అనుభవం కలిగిన వైద్యులు చికిత్స చేస్తారని వివరించారు. జడ్పీ చైర్ పర్సన్ సునీతామహేందర్రెడ్డి మాట్లాడుతూరాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి చూపు తగ్గి ఇబ్బంది పడవద్దని రాష్ట్ర ప్రభు త్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ ప్రైవేట్ దవాఖానాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకో వడం కష్టంగా మారడంతో , ప్రభుత్వం గ్రామానికే వైద్యులను, సిబ్బందిని పంపించి కంటి పరీక్షలు చేయించడం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, డిప్యూటీ డీఎం హెచ్వో డాక్టర్ జీవరాజ్, కౌన్సిలర్లు గాయత్రీలక్ష్మణ్, గోపాల్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.