బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో జోరుగా సాగుతున్నది. అన్ని నియోజకవర్గాల్లోనూ గులాబీ శ్రేణులు ఇంటింటికెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రజలతో మమేకమవుతూ గెలుపే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. ఊరూరా తిరుగుతూ బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధిని, అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు. తొమ్మిదిన్నరేండ్లలో చేసిన ప్రగతి పనులు, ప్రజా సంక్షేమ పథకాలే ప్రచారాస్ర్తాలుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పలువురు ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతూ మద్దతు తెలుపుతున్నారు.
శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మన్నెగూడలో జరిగిన బూత్ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పాల్గొని ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. మంత్రి సబితారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరులో పార్టీ శ్రేణులతో భారీ సమావేశాన్ని నిర్వహించారు. చేవెళ్ల మండలం ఊరెళ్ల గ్రామంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఫరూఖ్నగర్ మండలంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రచారం నిర్వహించగా.. కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్కు మద్దతుగా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ ప్రచారం చేశారు.
రంగారెడ్డి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు పార్టీ శ్రేణులు అలుపెరగకుండా జిల్లాలో ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు. గ్రామ గ్రామాన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. తొమ్మిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. బీఆర్ఎస్కు మద్దతుగా ప్రజానీకం సైతం అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నది. మరోవైపు ఎన్నికల సన్నాహ కార్యక్రమాలు సైతం ఊపందుకున్నాయి.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మన్నెగూడలో శుక్రవారం జరిగిన బూత్ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పాల్గొని ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి పార్టీ శ్రేణులతో భారీ సమావేశాన్ని నిర్వహించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్యాదవ్కు మద్దతుగా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ ప్రచారాన్ని నిర్వ హించారు. చేవెళ్ల మండలంలోని ఊరెళ్ల గ్రామంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు చతికిల పడగా బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర ఏ ఎన్నికలైనా సబ్బండ వర్ణాలు బీఆర్ఎస్ పార్టీకే అండగా ఉంటూ వస్తున్నారు. ఈసారి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొని జై కొడుతున్నారు. గుండెగుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గులాబీ పార్టీకి ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ పట్టంకట్టి జిల్లాలోని అన్ని స్థానాల్లో గెలిపించేందుకు ప్రజానీకం ఉవ్విళ్లూరుతున్నది.