మహబూబ్నగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : పాలమూరు పార్లమెంట్ స్థానంలో సత్తా చాటాలని పార్టీ క్యాడర్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాసంలో మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలతో గులాబీ బాస్ కేసీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మన్నె శ్రీనివాస్రెడ్డి గెలుపునకు చేపట్టాల్సిన కార్యాచరణ వ్యూహాల మీద చర్చించారు. మహబూబ్నగర్ స్థానం ముందునుంచే మంచి పట్టు ఉన్న స్థానమని.. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని మాజీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు.
ఈ స్థానం నుం చి ఎంపీగా ఉండి తెలంగాణను సాధించిన విషయా న్ని ఆయన గుర్తు చేశారు. ‘ఆ రోజు పాలమూరు ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గుండెల్లో పెట్టుకొని ఆదరించారు.. ఆ తర్వాత రెండుసార్లు వరుసగా గులా బీ విజయానికి బాటలు వేశారు’ అని గుర్తు చేశారు. బస్సుయాత్ర సందర్భంగా పాలమూరులో వచ్చిన జన సందోహమే మన పార్టీ విజయానికి తొలిమెట్టు అని.. దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలన్నారు. పాలమూరులో గెలిస్తే రాష్ట్ర రాజకీయాలే మారిపోతాయ ని.. అందరూ కలిసికట్టుగా శ్రమించి పార్టీ అభ్యర్థి మన్నెను గెలిపించాలన్నారు. పాలమూరు-రంగారె డ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇవ్వకపోవడం, బీ జేపీ బూటకపు వాగ్దానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
కరెంటు కోతలు, రైతుబంధు పింఛన్లు, ఇతరత్రా అంశాలను గ్రామీణస్థాయిలో చర్చకు పెట్టాల ని దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని, గ్రామీణస్థాయి వర కు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కేసీఆర్కు మాజీ ఎమ్మెల్యేలు వివరించారు. పదేండ్ల పాలనలో రైతులు, వృద్ధులు, మహిళలు, అనేక వర్గాలు సంతృప్తిగా ఉండేవని.. కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే వ్యతిరేకత మూట గట్టుకుందని.. దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తామని చెప్పారు. కాగా సమావేశంలో రెండుసార్లు కరెంటు పోయింది. సమీక్షలో మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.