నాగర్కర్నూల్లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై సమీక్షించారు. బస్సు యాత్ర తర్వాత మర్రి నివాసానికి వెళ్లిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మంచి ఆదరణ వస్తున్నదన్నారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయిందని, ప్రజల చూపు బీఆర్ఎస్వైపు ఉందని చెప్పినట్లు తె లిసింది. సిట్టింగ్ స్థానం కైవసం చేసుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉండాలని సూచించారు. సమావేశంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, మాజీ ఎమ్మె ల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెఢ్డి, జై పాల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.