చేవెళ్ల లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ తరఫున శుక్రవారం కలెక్టర్ శశాంకకు నామినేషన్ను దాఖలు చేస్తున్న ఆయన కుమారుడు కాసాని వీరేశ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల భిక్షపతి, జీ నాగేందర్గౌడ్, చిన్నంగి వెంకటేశం.
రంగారెడ్డి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : నామినేషన్ల ప్రక్రియలో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. బీఎల్ఎఫ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎంసీపీఐ(యూ)పార్టీ అభ్యర్థిగా వనం సుధాకర్.
ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీ అభ్యర్థిగా ముహ్మద్ చాంద్ పాషా, బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరఫున ప్రతిపాదకులు మేకల భిక్షపతిలు నామినేషన్లను ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంకకు అందజేశారు. గత రెండు రోజుల్లో చేవెళ్ల స్థానానికి మొత్తం ఆరు నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ తెలిపారు.