పెద్దఅంబర్పేట, నవంబర్ 17: మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పిగ్లిపూర్, కొత్తగూడెం, బాటసింగారం, జాఫర్గూడ, పీర్లగూడెం, మజీద్పూర్, గుంతపల్లి, ఇనాంగూడ, లష్కర్గూడ, సుర్మయగూడ, గండి చెరువు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కిషన్రెడ్డికి మహిళలు ఘన స్వాగతం పలికారు. మంగళహారతులు, బతుకమ్మలతో గ్రామాల్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోనూ రూ.కోట్ల నిధులతో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు.
ఐదేండ్లకోసారి వచ్చే మాయగాళ్ల మాటలు నమ్మొద్దని సూచించారు. ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండకపోతే.. ఆ తర్వాత బలిపశువులం కావాల్సి వస్తుందన్నారు. మరోసారి బీఆర్ఎస్కే ఓటేసి.. నాలుగోసారి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్త కిషన్గౌడ్, కోట వెంకట్రెడ్డి, సీనియర్ నాయకులు నోముల కృష్ణ, లెక్కల విఠల్రెడ్డి, చక్రధర్గౌడ్, సర్పంచ్లు కోట రాజలక్ష్మారెడ్డి, ఎర్రవెల్లి లతశ్రీ, కొర్ర లావణ్య, పారిజాత, ఎంపీటీసీ సీక సాయికుమార్గౌడ్, నాయకులు నారోజు రాజారాంచారి, జంగయ్యయాదవ్, ఉమాకాంత్, వెంకటేశ్యాదవ్, ఎడ్ల మహేందర్, గోపగోని శ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
యాచారం : ఐదేండ్లకోసారి ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్ల కోసం కనిపించే నాయకుల మాయమాటలతో మోసపోవద్దని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మల్కీజ్గూడ, తక్కళ్లపల్లితండా, తక్కళ్లపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో గురువారం రాత్రి రోడ్షో నిర్వహించారు. ఆయా గ్రామాలలో కిషన్రెడ్డి రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అవినీతి కాంగ్రెస్కు ఓటేస్తే పేదలకు సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా సక్రమంగా అందక పేదల బతుకులు ఆగమైతాయని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే ఎలాంటి కష్టాలు ఉండవన్నారు.
కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి పాచ్ఛ భాష, సర్పంచ్లు జగదీశ్, సంతోష, హబీబుద్దీన్, ఎంపీటీసీలు శారద, సుమతమ్మ, నాయకులు తలారి మల్లేశ్, చిన్నోళ్ల యాదయ్య, చిక్కుడు గుండాలు, అబ్బయ్య, లోహిత్రెడ్డి, శంకర్నాయక్ పాల్గొన్నారు.
అభివృద్ధి
ఇబ్రహీంపట్నం : నియోజకవర్గాన్ని ప్రతిక్షణం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయే అభివృద్ధి ప్రదాత మంచిరెడ్డి కిషన్రెడ్డికి మరోసారి అవకాశం కల్పించాలని ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిదిలోని పలు వార్డుల్లో కౌన్సిలర్లతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభు త్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన క ల్పించారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : బీఆర్ఎస్ గెలుపుకోసం కార్యకర్తలు, నాయకులు కంకణ బద్ధ్దులై పనిచేయాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండల పరిధిలోని పోచారం గ్రామంలో శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమంలో ఇబ్రహీంపట్నం ప్రాంతాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపిన మంచిరెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు. మంచిరెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధిలో ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆదిబట్ల : కారు గుర్తుకు ఓటేసి మరోసారి మంచిరెడ్డి కిషన్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. ఎంపీ పటేల్గూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం రవీందర్గౌడ్, ఆదిబట్ల మున్సిపల్ ప్రధాన కార్యదర్శి పొట్టి శ్రీకాంత్, మున్సిపల్ కోఆప్షన్ అబేదాబేగం, నరసింహ, గజ్జెల లక్ష్మి, అశోక్, జగన్, బాలరాజు, రమేశ్, శ్రీను పాల్గొన్నారు.