కల్వకుర్తి, నవంబర్ 10 : మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యరి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం కల్వకుర్తి మున్సిపాలిటీ 2వ వార్డు పద్మశ్రీ నగర్ కాలనీలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంతో కలిసి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ కారుగుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కల్వకుర్తి మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రభుత్వం నిధులు కేటాయించిన విషయాలను గుర్తు చేశారు.
కల్వకుర్తి మున్సిపాలిటీ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని చెప్పారు. మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఓట్ల కోసం వచ్చే ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మవద్దని సూచించారు. ఓట్ల కోసం మాయమాటలు చెబుతారని, గారడి మాటలు మాట్లాడతారని, అలాంటి వారితో జాగ్రత్తగా ఉం డాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించా రు. తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లును కోరారు. కార్యక్రమం లో మున్సిపల్ వైస్ చైర్మన్ షాహెద్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్రెడ్డి, వైస్ ఎంపీపీ గోవర్ధన్, కౌన్సిలర్లు యాదమ్మ, సూర్యప్రకాశ్రావు, సైదులుగౌడ్, మనోహర్రెడ్డి, ఖలీల్, బీఆర్ఎస్ నాయకులు మధు, రవి, యాదగిరి, వెంకటేశ్, ప్రదీప్, ఖాదర్, హసన్, శ్రీనివాస్గౌడ్ సాధిక్ పాల్గొన్నారు.
వెల్దండ, నవంబర్ 10: తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నా రు. శుక్రవారం వెల్దండకు చెందిన కాంగ్రెస్ జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్రెడ్డి, సీనియర్ నాయకులు కానుగుల జోగయ్య , చల్లా మధుసూదన్రెడ్డితో పాటు 50మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే జైపాల్యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీవాస్రెడ్డి, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భం గా వెల్దండలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు చేస్తుందన్నారు. 70 ఏండ్లలో చేయలేని వారు, ఇప్పుడు చేస్తారా అని ప్రశ్నించారు. కర్ణాటకలో ప్రజలను మోసం చేసినట్లే ఇక్కడ కూడా మోసం చేయాలనుకుంటున్నారని అన్నారు. అలాగే లింగారెడ్డిపల్లి కి చెందిన లక్ష్మీనారాయణతో పాటు పలువురు ఎమ్మె ల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాంరెడ్డి, మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి నాయకులు చొక్కన్నపల్లి శ్రీనివాస్రెడ్డి, జంగిలి ఆనంద్, ప్రవీణ్, శివ, కడారి కృష్ణయ్య, శ్రీను, సాయిలు, ప్రసాద్, పర్వతాలుగౌడ్, ఎంఎస్ గౌడ్ ఉన్నారు.
మండల కేంద్రంలోని 3, 4 వ వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు మద్దతుగా శుక్రవారం నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా.. గ్రామంలో ప్రజలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రచార కరపత్రాలు పంచి పెట్టారు. కారు గుర్తుకు ఓటేయాలని, జైపాల్యాదవ్ను భారీ మెజార్టీతో గెలుపించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నిరంజన్, యాదగిరి, ఆనంద్, శంకర్, ప్రభాకర్, కృపానందం, రాము, అర్జున్, శేఖర్, రవి, బాల్రాజ్, చంద్రశేఖర్, వెంకటయ్య, ప్రసాద్, ఈదులపల్లి శ్రీనివాసులు, శ్రీకాంత్, రాజు, శివ, వెంకటయ్య, వెంకట్ముదిరాజ్, ఎంఎస్ గౌడ్, నిరంజన్గౌడ్, మల్లయ్య, బాలకృష్ణ, సాయిలు, పర్వతాలు గౌడ్ పాల్గొన్నారు.
కడ్తాల్, నవంబర్ 10: కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ పాత రోజులు వస్తాయని, రైతులకు కరెంట్ కష్టాలు తప్పవని జెడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. శుక్రవారం మైసిగండిలో సర్పంచ్ తులసీరాంనాయక్, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రవినాయక్తో కలిసి జెడ్పీటీసీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను, మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ, కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. కార్యక్రమం లో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, వైస్ ఎంపీపీ ఆనంద్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, రైతుబంధు సమితి మండల, గ్రామాధ్యక్షులు వీర య్య, నర్సింహ, పత్యానాయక్, శంకర్, శ్రీను, హర్యానాయక్, అమృనాయక్, లక్ష్మణ్, శివనాయక్ పాల్గొన్నారు.