పెద్దఅంబర్పేట, జనవరి 27 : ఇల్లులేని వారు తన సొంత స్థలంలో నూతన ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు. మండలంలోని నల్లవెల్లి, చింతపట్ల గ్రామాల్లో ప్రగతి నివేదన యాత్ర శుక్రవారం కొనసాగింది. నల్లవెల్లి పాఠశాల మరమ్మత్ కోసం రూ.20లక్షలు, మంథన్గౌరెల్లి-నల్లవెల్లి రోడ్డు నిర్మాణం కోసం రూ.20లక్షలు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.5లక్షలు, వడ్డెర సంఘం భవన నిర్మాణానికి రూ.10లక్షలు, ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ. 5లక్షల నిధులను ఎమ్మెల్యే ద్వారా ఇప్పించి గ్రామాభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన 15 మందికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందన్నారు. మన ఊరు మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సహకారంతో గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం చింతపట్ల గ్రామంలో యాత్ర కొనసాగించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్, నాయకులు చిన్నోళ్ల యాదయ్య, జిల్లా రాములు, యాదయ్యగౌడ్, లక్ష్మీపతిగౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ మక్కపల్లి స్వరూప, లిక్కి నర్సింహారెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.