ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 11 : అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం ఖాయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిబట్ల, పెద్దఅంబర్పేట్, తుర్కయాంజాల్ మున్సిపాలిటీల్లోని వివిధ కాలనీల నుంచి పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు 75 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువాలు కప్పి వారిని ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీఆర్ఎస్ ప్రధానపాత్ర వహించనుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అతితక్కువ కాలంలో అబివృద్ధి పథంలో ఉరకలు వేస్తున్న తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే భారతదేశం కూడా బీఆర్ఎస్ ద్వారా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మధు, బీమయ్య, వెంకట్, జీవన్, శ్రీనివాస్, సురేశ్, గోపి, నరేశ్, బాలరాజు, ఎలయ్య, నాగయ్య, నాయకులు పాల్గొన్నారు.
దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
మంచాల, : సీఎం కేసీఆర్ ఎంతో ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఎంతో మంది పేద దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని, పథకంతో దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని తాళ్లపల్లి గూడ గ్రామానికి చెందిన ఏర్పుల హరికృష్ణకు దళితబంధు ద్వారా మంజూరైన ట్రాక్టర్ను ఆదివారం లబ్ధిదారుడికి ఎమ్మెల్యే అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షే మ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు. అభివృద్ధిని ఓర్వలేకనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని అన్నారు. సంక్షేమంలో దేశానికి రాష్ట్రం ఆదర్శంగా ఉందన్నారు. కా ర్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, వార్డు సభ్యులు వెంకటేశ్, కృష్ణ, గణేశ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.