మంచాల, అక్టోబర్ 17 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతున్నదని, కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీలు బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోతో కొట్టుకుపోయాయని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల మండల కేంద్రంలోని దండేటికార్ ఫంక్షన్హాల్లో పార్టీ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ ఆధ్వర్యంలో మంగళవారం బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని స్వరాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేశానని, అందుకే నేడు నియోజక వర్గంలో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కు మాత్రమే ఉందని చెప్పారు. ప్రభుత్వ ఫలాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటు అడగాలని కార్యకర్తలకు సూచించారు. 40 రోజుల వరకు ఏ ఒక్క కార్యకర్త కూడా విశ్రమించకుండా గ్రామాల్లో ప్రతి ఇంటికీ తిరుగుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోలో రైతుబంధు రూ.16 వేలు, ఆసరా పింఛన్ రూ.5016, గ్యాస్ సిలిండర్ రూ.400, పేద మహిళలకు నెలకు రూ.3 వేల పింఛన్తో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. నాలుగో సారి కూడా ఎమ్మెల్యే కిషన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని కార్యకర్తలు పెద్ద ఎత్తున సమావేశంలో నినాదాలు చేశారు.
రాజకీయ చైతన్యం ఉన్న మంచాల మండలం నేడు బీఆర్ఎస్కు అడ్డగా మారిందని ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. అందుకే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి ఫలాలను చూసి ప్రజలే నేరుగా ముందుకు వచ్చి కారు గుర్తుకు ఓటు వేసేందుకు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని అన్నారు. ప్రతి పక్షపార్టీలకు చెందిన నాయకులు ఎన్ని కుతంత్రాలు చేసినా మూడవసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎన్నికల ఇన్చార్జి తీగల కృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, ఎంపీపీ నర్మద, మండల ప్రధాన కార్యదర్శి బహదూర్, సహకార సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ పుల్లారెడ్డి, బొద్రమోని యాదయ్య, బీఆర్ఎస్ నాయకులు దండేకార్ రవి, మొగిలి వెంకటేశ్, మొగిలి పావని, ఎండీ జానీపాషా, జంబుల కిషన్రెడ్డి, సుకన్య, నర్సింగ్ అనిత, కందాల శ్రీశైలం పాల్గొన్నారు.