షాబాద్, డిసెంబర్ 24: గత ఉమ్మడి రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజ లు అనేక ఇబ్బందులు పడ్డారు. షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామానికి 30ఏండ్లుగా రోడ్డు లేక ప్రజలు, వాహనదారులు అనేక అవస్థలు పడ్డారు.
2019 సంవత్సరంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసిన పోనమోని కేతన తనను ఎన్నికల్లో గెలిపిస్తే గ్రామానికి బీటీ రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆరు నెలల వ్యవధిలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో గ్రామానికి రూ.కోటి నిధులతో బీటీ రోడ్డు వేయించడంతో గ్రామస్తుల 30ఏండ్ల కల నేరవేరింది. ప్రస్తుతం ఈ రోడ్డుపై ప్రయాణం సాఫీగా సాగుతున్నది.