కులకచర్ల, నవంబర్ 11 : మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి ప్రచారాన్ని శనివారం ప్రారంభించారు. మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామ పంచాయతీ నుంచి ప్రచారం ప్రారంభించిన ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ పాలనలో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మధ్యవర్తి లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చేసేందుకు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో ప్రభుత్వ పథకాలను వివరించారు. ముజాహిద్పూర్, పటేల్చెరువుతండా, దాస్యనాయక్తండాల్లో ప్రచారం నిర్వహించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సేరి రాంరెడ్డి, బీఆర్ఎస్ చౌడాపూర్ మండల అధ్యక్షుడు సత్తినేని సుధాకర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజు, జడ్పీటీసీ రాందాస్నాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందిపల్ వెంకట్, బీఆర్ఎస్ నాయకులు మేగ్యనాయక్, రాజప్ప, నర్సింహ, లక్ష్మయ్య, శ్రీనివాస్, రామకృష్ణ, అల్లాపూర్ సర్పంచ్ శివబాలునాయక్, రాంరెడ్డిపల్లి సర్పంచ్ సత్యయ్య, ఉపసర్పంచ్ దామోదర్రెడ్డి, ముజాహిద్పూర్ ఎంపీటీసీ విజయలక్ష్మి, దాస్యనాయక్తండా సర్పంచ్ శంకర్నాయక్, రాజు, మందిపల్ సర్పంచ్ మఠం ప్రమీల, బీఆర్ఎస్ నాయకులు రాజశేఖర్, లింగంపల్లి బీఆర్ఎస్ నాయకులు శివకుమార్, ఆయా గ్రామాల బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చౌడాపూర్ మండల పరిధిలోని లింగంపల్లి, వాల్యనాయక్తండా, అడవివెంకటాపూర్, ఈర్లవాగుతండా, విఠలాపూర్, చౌడాపూర్, మందిపల్ గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.