కడ్తాల్, ఏప్రిల్ 15 : అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని జడ్పీటీసీ జర్పుల దశరథ్నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నాగర్కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రచార రథాన్ని వైస్ ఎంపీపీ ఆనంద్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్గుప్తాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని విమర్శించారు. ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అరకొర పథకాలను అమలు చేసి ప్రజాపాలనను గాలికొదిలిందని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. గురుకులాలను ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు, అగ్రకులాల్లోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యనందించడానికి కృషి చేసిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ సేవ్యానాయక్, , మాజీ సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, హరిచంద్నాయక్, సాయిలు, భూనాథ్నాయక్, నాయకులు రామకృష్ణ, లాయక్అలీ, నర్సింహ, హర్యానాయక్, రమణ, పాండూనాయక్, వెంకటేశ్, భీమన్, శ్రీను, అంజి, కృష్ణ, సూర్యా, శ్రీకాంత్, సురేశ్, రమేశ్, సత్యం, మల్లేశ్, చందు తదితరులు పాల్గొన్నారు.