కొడంగల్, జనవరి 24: మండలంలోని హస్నాబాద్ గ్రామ పంచాయతీ కార్మికురాలు లక్ష్మి ఉత్తమ పారిశుధ్య కార్మికురాలిగా ఎంపికయ్యారు. స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా తడి, పొడి చెత్తను వేరు చేయడంలో ప్రజలకు అవగాహన కల్పించడంపై రాష్ట్రం నుంచి నలుగురిని కేంద్ర ప్రభుత్వం ఉత్తమ అవార్డుకు ఎంపిక చేసింద
అందులో హస్నాబాద్ గ్రామపంచాయతీ కార్మికురాలు లక్ష్మి కూడా ఉన్నారని సర్పంచ్ పకీరప్ప తెలిపారు. ఈ నెల 26వ తేదీన భారత ప్రధాని నరేంద్రమోదీ ద్వారా ఈ అవార్డును అందుకోనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో హస్నాబాద్ గ్రామ పంచాయతీకి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉన్నదని, ఇందుకు కృషి చేసిన లక్ష్మిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.