ఆమనగల్లు, ఆగస్టు 27 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బోనాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలీ శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్ అన్నారు. ఆమనగల్లు పట్టణంలో కంఠ మహేశ్వరస్వామి, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, అమ్మవారుల బోనాల ఉత్సవాలను ఆయా కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను అలంకరించి సాయంత్రం భాజా భజంత్రీలు, శివ సత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలతో బోనాలను ఊరేగిస్తూ ఆలయాలకు చేరుకుని బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా గోలీ శ్రీనివాస్రెడ్డి, పత్యానాయక్ మాట్లాడుతూ పూర్వం నుంచి తెలంగాణలో గ్రామ దేవతలకు బోనాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఉత్సవాల్లో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారీ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు వగ్గు మహేశ్, మాజీ వార్డు సభ్యుడు అల్లాజీ, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు డేరంగుల వెంకటేశ్, గౌడ సంఘం నాయకులు అల్లాజీగౌడ్, నిరంజన్గౌడ్, వివిధ కుల సంఘాల నాయకులు యాదయ్య, జానయ్య, సురేశ్, నవీన్, కృష్ణ, వినయ్ పాల్గొన్నారు.