వికారాబాద్ : వికారాబాద్ మండల పరిధిలోని పీలారం, ధారూరు మండల పరిధిలోని రుద్రారం గ్రామాల్లో మైసమ్మ జాతర ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. అమ్మవారులకు మహిళలు బోనాలు తీసి నైవేద్యాలు సమర్పించారు. బోనాల ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారులకు నైవేద్యాలు సమర్పించి గ్రామాలను చల్లంగా చూడాలని మొక్కులు మొక్కుకున్నారు.
జాతరకు వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే వెంట మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, రాజునాయక్, సర్పంచ్లు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.