తలకొండపల్లి, జూన్ 25 : మండల పరిధిలోని పెద్దూర్తండా గ్రామపంచాయతీలో గిరిజన సాంప్రదాయం ప్రకారం.. సేవాలాల్ గురువుకు బోగ్భండారం సమర్పించి దుర్గామాత అమ్మవారికి బోనాలతో నైవేద్యాలు పెట్టారు.
చేవెళ్లటౌన్, జూలై 25 : మండలపరిధిలోని కమ్మెట, ఇబ్రహీంపల్లి గ్రామాల్లో మహిళలు మైసమ్మ బోనాలను పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.
నందిగామ : బోనాలతో ఊరేగింపుగా వెళుతున్న ఎమ్మెల్యే, నాయకులు
మొయినాబాద్, జూలై 25 : మండల పరిధిలోని సురంగల్, శ్రీరాంనగర్, కేతిరెడ్డిపల్లి, చిన్నమంళారం , కాశీంబౌలి, చిలుకూరు, నక్కలపల్లి గ్రామాల్లో ఎల్లమ్మ తల్లికి, మైసమ్మ అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించారు. సురంగల్ గ్రామంలో యవకులు తొట్టెలను, శ్రీరాంనగర్లో ఎడ్ల బండ్లను కట్టి గ్రామంలో ఊరేగించారు.
మోమిన్పేట, జూలై 25 : మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని చిన్న కొల్కుంద, ఎన్కతల గ్రామంలో పోచమ్మ, దుర్గమ్మలకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బోనాలు సమర్పించి మొక్కలు చేల్లించుకున్నారు.
నందిగామ, జూలై 25 : నందిగామ మండలం అంతిరెడ్డిగూడ గ్రామంలో సోమవారం మైసమ్మ, పోచమ్మ బోనాలు పోతరాజుల విన్యాసాలు, డప్పు దరువులు, శివసత్తుల పునకాల నడుమ ఘనంగా జరిగాయి. అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
షాబాద్, జూలై 25 : మండలంలోని కుమ్మరిగూడ, బోడంపహాడ్, షాబాద్ తదితర గ్రామాల్లో పోచమ్మ, మైసమ్మ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచి ఆయా గ్రామాల్లోని గ్రామ దేవతలకు మొకులు చెల్లించుకున్నారు. సాయంత్రం మహిళలు కొత్త బట్టలు ధరించి బోనాలు ఎత్తుకుని ఊరేగింపు చేపట్టారు. బోనాల ఊరేగింపులో శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, యువకుల కేరింతలతో గ్రామం మార్మోగింది.