బొంరాస్ పేట : రైతు సంక్షేమమే ప్రభుత్వ పరమావధి అని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని బురాన్పూర్, ఎన్నెమీదితండా(కొత్తూరు), ఎన్నెమీదితండా(వడిచెర్ల), కొత్తూరు, ఎనికేపల్లి గ్రామాల్లో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయా గ్రామాలలో ఎడ్లబండి, ట్రాక్టర్లతో ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించారు. రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా ఊరేగింపుల్లో పాల్గొని నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు కష్ట సుఖాలు తెలిసిన కేసీఆర్ రాష్ట్రానికి సీఎం కావడంతో రైతులకు కావలసిన మంచి పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.
ఆయా గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. బురాన్పూర్ పాఠశాలలో విద్యార్థులు వేసిన రైతుబంధు ముగ్గులను పరిశీలించి అభినందించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, జడ్పీటీసీ హాన్ అరుణాదేశు, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మహేందర్రెడ్డి పాల్గొన్నారు.