యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామానికి చెందిన బట్టు ముత్తయ్య అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ప్రైవేటు దవాఖాన ఖర్చులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న అతనికి సీఎం సహాయనిధి పథకం కింద రూ. 60,000ల చెక్కును ఆయన బాధితుడికి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం అండగా నిలిచిందన్నారు.
ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయించుకొని ఫీజులు చెల్లించలేని పేదలను ఆర్థికంగా ఆదుకుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ తదితరులు ఉన్నారు.