ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 11 : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం ఇబ్రహీంపట్నంలో ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని పులమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో లిమ్స్ దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్యులు విశ్వనాథ్, దినేశ్ తదితరుల ఆధ్వర్యంలో చికిత్సలు నిర్వహించి మందులు అందజేశారు.
అనంతరం ఈశ్వరాంజనేయస్వామి ఆలయం ఆవరణలో కౌన్సిలర్లు యాచారం సుజాతా రవీందర్, బర్తాకి జగన్, మంద సుధాకర్ తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే నృత్యాలు చేశారు. క్యాంపు కార్యాలయంలో ప్రతి ఒక్కరికీ భోజన సదుపాయాన్ని కల్పించారు. వెంకటరమణ నగర్ కాలనీలో పారిశుధ్య సిబ్బందితో కలిసి కేక్కట్చేసి వారిమధ్య జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. మహిళా పారిశుధ్య కార్మికులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. నరాల వ్యాధితో బాధపడుతూ కదల్లేని స్థితిలో ఉన్న చాణక్య అనే విద్యార్థి ఎమ్మెల్యేపై అభిమానంతో తాను స్వయంగా గీసిన ఎమ్మెల్యే చిత్రపటం పెయింటింగ్ను బహూకరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు నీలం శ్వేత, పద్మ, మమత, శ్రీలత, బాలరాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బుగ్గరాములు, రమేశ్గౌడ్, చీరాల రమేశ్, కిషన్గౌడ్పాల్గొన్నారు.
శుభాకాంక్షలు తెలిపిన సీఎం, మంత్రులు
ఇబ్రహీంపట్నం : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నాయకులు ఫోన్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
రామాలయంలో ప్రత్యేక పూజలు
తుర్కయాంజాల్ : ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్నగర్ కాలనీలో ఉన్న రామాలయంలో బీఆర్ఎస్ నాయకులు పూజలు చేశారు. కార్యక్రమంలో కొంతం యాదిరెడ్డి, రామ్రెడ్డి, స్వామిగౌడ్, వెంకట్రెడ్డి, బాల్రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.