వలిగొండ : రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రత్యేక విజన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని భువనగిరి శాసన సభ్యుడు పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని టేకులసోమారం, రెడ్లరేపాక, దాసిరెడ్డిగూడెం, వలిగొండ గ్రామాల్లో మండల రైతుబంధు సమితి కన్వీనర్ పనుమటి మమత నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల ర్యాలీకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి హాజరయ్యారు. ఆయనకు డప్పు చప్పుళ్లతో, బాణా సంచకాల్చుతూ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్రెడ్డి ఆధ్వర్యంలో గజమాలతో స్వాగతం పలికారు.
అనంతరం టేకులసోమారం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించన అనంతరం టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి రైతుబంధు ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి టేకులసోమారం గ్రామం నుంచి వలిగొండ వరకు 20కిలో మీటర్లు స్వయంగా ట్రాక్టర్ను నడిపి మండలంలోని వివిధ గ్రామాల నుంచి ట్రాక్టర్లతో తరలివచ్చిన రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ఖాతాల్లో రూ. 50వేల కోట్లను జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందన్నారు. రెండున్నర సంవత్సరాల వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.