షాద్నగర్టౌన్, డిసెంబర్ 30: అయ్యప్పస్వామిపై, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాస్తిక సమాజం నాయకుడు బైరి నరేశ్ను కఠినంగా శిక్షించాలని అయ్యప్పస్వామి మాలధారులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. అతడిపై పీడీ యాక్టు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తమ మనోభావాలను దెబ్బతీయడం సరికాదన్నారు. షాద్నగర్ అయ్యప్ప భక్త సమాజం సభ్యులు, అయ్యప్పమాల దీక్షాపరులు, పలువురు నాయకులు శివమారుతిగీతా అయ్యప్ప మందిరం నుంచి పట్టణ ముఖ్యకూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అతడి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, నందీశ్వర్, ప్రతాప్రెడ్డి, భక్త సమాజం సభ్యులు, స్వాములు, భక్తులు చంద్రశేఖర్, బసప్ప, మురళి, రమేశ్, పూర్ణచందర్, వెంకటేశ్, రమేశ్, పరిగి శ్రీను, వెంకటేశ్, కోటిలింగం, మధు పాల్గొన్నారు.
నరేశ్పై చర్యలు తీసుకోవాలి
యాచారం : అయ్యప్ప స్వామి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్పై చర్యలు తీసుకోవాలని అయ్యప్పస్వామి మాలదారులు డిమాండ్ చేశారు. గురుస్వామి చంద్రమోహన్ నాయర్ ఆధ్వర్యంలో ఎస్ఐ శంకరయ్యకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో గురుస్వామి కొప్పు భాష, ముదిరెడ్డి శ్రీధర్రెడ్డి, నారాయణశెట్టి, కుమ్మరిగూడం పురుషోత్తం, ఏనుక రవి, భూతరాజు నాగరాజు, కేశమోని యాదయ్య, నర్సింహ ఉన్నారు.
పోలీసులకు ఫిర్యాదు
మంచాల : గురు స్వామి ఆరుట్ల ఎంపీటీసీ కావలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బైరి నరేశ్పై చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన చౌరస్తాలో నరేశ్ దిష్టి బొమ్మను దహనం చేశారు
చేవెళ్లటౌన్ : హిందూ దేవుళ్లను దూషించిన నరేశ్పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో హిందూ సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. అతను మాట్లాడిన మాటల వల్ల శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగించే విధంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా అయ్యప్ప మాలధారులు బీజాపూర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ సద్గురు వేముల శంకరమ్మమాత సభ్యులు మల్గారి నరోత్తమరెడ్డి, వెంకట్ రెడ్డి, శీనయ్య గౌడ్, వెంకటేశ్, రాంరెడ్డి, కిష్ణ తదితరులు ఉన్నారు.
మనోభావాలు దెబ్బతీయడం సరికాదు
కేశంపేట : అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో ఎస్ఐ ధనుంజయ్కు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను కించపర్చిన బైరి నరేశ్ మాట్లాడడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అయ్యప్పస్వాములు శ్రీనివాస్రెడ్డి, సంతోష్కుమార్, రమేశ్, నందు తదితరులు పాల్గొన్నారు.
పీడీ యాక్టు నమోదు చేయాలి
మొయినాబాద్ : హిందూ దేవుళ్లు, అప్పయ్య స్వామిని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్పై పీడీ యాక్టు ప్రయోగించి కఠిన చర్యలు చేపట్టాలని అయ్యప్ప భక్తులు, ఆధ్యాత్మిక వేత్తలు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఆందోళన చేస్తున్న అయ్యప్ప భక్తులతో పోలీసులు మాట్లాడి.. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకుడు రంగరాజన్, నాయకులు మధుసూదన్రెడ్డి,, ప్రభాకర్రెడ్డి, శ్రీరాములు, అయ్యప్ప భక్తులు రాంచందర్, వీరారెడ్డి, శ్రీకాంత్, పలు సంఘాల నాయకులు , అయ్యప్ప భక్తులు ఉన్నారు.
కఠినంగా శిక్షించాలి..
ఇబ్రహీంపట్నంరూరల్ : అయ్యప్పస్వామిపై అనుచిత వాఖ్యలు చేసిన నరేశ్ను కఠినంగ శిక్షించాలని కౌన్సిలర్ నాయిని సత్యనారాయణ, పలువురు అయ్యప్పసేవాసమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని ఎస్ఐ శేఖర్కు ఫిర్యాదు చేవారు. కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు చందునాయర్గురుస్వామి, బర్ల జగదీశ్యాదవ్, జక్క రవీందర్రెడ్డి, అయ్యప్పభక్తులు పాల్గొన్నారు.