ఆమనగల్లు, ఆగస్టు 18 : వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులో దుకాణ సముదాయ నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా వ్యవసాయ మార్కెట్లను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. అనేక పథకాలతో ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తున్నదన్నారు. రుణమాఫీ కోసం ఒకే రోజు ట్రెజరీ చెక్కుతో అత్యధికంగా సింగిల్ పేమెంట్ చేయడం గొప్ప విషయమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం రాత్రి ఎ మ్మెల్యే జైపాల్యాదవ్తో కలిసి దుకాణ సముదాయ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మా ట్లాడుతూ రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోట వ్యవసాయ మార్కెట్లను ఆధునికరించామన్నారు. రైతులు పండించి న ధాన్యం నిల్వ చేసేందుకు గోధాములు, వే బ్రిడ్జిలు నిర్మించామని, ఆన్లైన్ సేవల ద్వారా వ్యవసాయ రాబడి పెంచామన్నారు. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేశామని, ఒకే రోజు ట్రెజరీ చెక్కు ద్వారా సింగిల్ పేమెంట్ను అత్యధికంగా ఇవ్వడం ఇటీవల కాలంలో చరిత్రలో మొ దటిసారని తెలిపారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ మార్కెట్కు ఆదాయం పెంచేందుకు రూ.65 లక్షలతో 8 దుకాణాలను నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెటింగ్ జిల్లా అధికారి ఛాయదేవి, వ్యవసా య మార్కెట్ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి, విజయ్ గౌడ్, జడ్పీటీసీ అనురాధ, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్ గుప్తా, ఎంపీటీసీ కుమార్, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి సరోజ, ఏవో అరుణకుమారి, ఏఎంసీ డైరెక్టర్లు సుభాష్, రమేశ్, లాయక్ అలీ, కృష్ణ య్య, నిరంజన్, ము న్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, నాయకులు అల్లాజీ, శ్రీనివాస్, వెంకటే శ్, జంతుక కిరణ్, కొమ్ము ప్రసాద్ పాల్గొన్నారు.